Amala Paul: నటి అమలాపాల్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమాల్లో కంటే ఎక్కువగా కాంట్రవర్సీ వార్తలతో మంచి పాపులారిటీ సంపాదించింది. ఎటువంటి విషయమైనా నిర్మొహమాటంగా చెప్పేసి అమలాపాల్ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఒకానొక సమయంలో సినిమా రంగంలో వరుస అవకాశాలు అందకుండా అమలాపాల్ ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో రాణిస్తోంది. తాజాగా ఆహా వెబ్ సిరీస్ లో కుడిఎడమైతే లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మంచి ఎంటర్టైన్మెంట్ చేయడం జరిగింది. నిత్యం ఏదో కామెంట్ చేస్తూ వార్తల్లో నిలిచే అమలాపాల్ తాజాగా తన రెమ్యూనరేషన్ విషయంలో.. సరి కొత్త కండిషన్ లు పెడుతూ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవలే భారీ రెమ్యునరేషన్ పెంచేసిన అమలాపాల్.. తన దగ్గర సినిమాలు చేయాలంటే కచ్చితంగా ఈ కండిషన్ లు పాటించాల్సిందే అంటూ వస్తున్న నిర్మాతలకు దిమ్మ తిరిగే షాక్ లు ఇస్తుందట. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ భారీ చిత్రాన్నికి సంబంధించి అవకాశం కూడా వదులుకున్న ట్లు సరికొత్త వార్త ఇప్పుడు బయటపడింది. విషయంలోకి వెళితే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా “ఘోస్ట్” అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రారంభంలో ఈ సినిమాలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
కానీ అదే సమయంలో కాజల్ ప్రెగ్నెంట్ కావటంతో… సినిమా ప్రారంభించక ముందే కాజల్ ని నిర్మాతలు తప్పించారు. ఈ తరుణంలో.. కాజల్ స్థానంలో అమలా పాల్ అయితే బాగుంటుందని.. సినిమా యూనిట్ ఆమెను సంప్రదించగా… వాళ్లకు దిమ్మతిరిగే షాక్ ఇవ్వడం జరిగిందట. రెమ్యూనరేషన్ భారీగా పెంచడంతోపాటు.. అమలాపాల్ కొన్ని కండిషన్లు పెట్టినట్లు … దాంతో సదరు నిర్మాత దండం పెట్టేసి వెనక్కి వచ్చినట్లు లేటెస్ట్ టాక్ నడుస్తుంది. సినిమా కంప్లీట్ అయిన కంప్లీట్ అవ్వకపోయినా అనుకున్న టైం కల్లా.. తన ఫుల్ ఎమౌంట్ చేయాలి అనే కండిషన్ అమలాపాల్ పెట్టినట్లు కరోనా కారణం గా ఏ విధమైన సినిమా ఆగిపోయిన తన రెమ్యూనరేషన్.. మాత్రం ఇచ్చేయాలన్న తరహాలో అమలాపాల్ షరతులు పెడుతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!