Aishwaryaa: సినిమా రంగంలో ప్రస్తుతం విడాకులు తీసుకుంటున్న జంటలు ఎక్కువైపోతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్టోబర్ మాసంలో సమంత, నాగ చైతన్య ఇద్దరూ విడిపోయారు. పట్టుమని ఐదు సంవత్సరాలు కూడా కలిసి జీవించలేక పోయారు. ఇక ఇదే తరుణంలో ఇటీవల తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య స్టార్ హీరో ధనుష్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. 18 సంవత్సరాల వైవాహిక బంధానికి గుడ్ బై చెబుతూ సోషల్ మీడియా వేదికగా విడిపోతున్నట్లు ఎవరికివారు క్లారిటీ ఇచ్చారు.
కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో చూడముచ్చటగా ఉండే ఈ జంట విడిపోవడం అభిమానులకు ఆందోళన కలిగించేటట్లయింది. ఇటువంటి తరుణంలో అసలు వీరిద్దరూ విడిపోవడానికి గల కారణం ఏంటో ఎవరికీ అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. ఇదిలా ఉంటే విడాకులు తీసుకున్న తర్వాత ఐశ్వర్య మరోపక్క స్టార్ హీరో ధనుష్ ఎవరికి వారు వారి పనుల్లో బిజీ అయిపోయారు. ఇటువంటి తరుణంలో వీళ్లిద్దరి విడాకులకు సంబంధించి రకరకాల వార్తలు బయట చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఇటువంటి క్లిష్ట సమయంలో ఐశ్వర్య ఫస్ట్ టైం మీడియా ముందు ధనుష్ తో విడాకుల మ్యాటర్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
ఆమె మీడియాతో ఏమైంది అంటే… ప్రతి ఒక్కరి జీవితంలో ఒక టైంలో ఆటుపోట్లు ఎదురవుతాయి. కచ్చితంగా వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో మనకు ఏది జరగాలని ఉంటే అది జరుగుతుంది. ప్రేమ అనేది ఒక అద్భుతమైన భావవ్యక్తీకరణ… వ్యక్తిగత అంశాల తో దానికి ఎటువంటి సంబంధం ఉండదు. మనిషి ఎదిగేకొద్దీ ప్రేమ నిర్వచనం కూడా మారుతోంది. అయినా గాని నా ప్రేమ ఒక వ్యక్తికీ పరిమితం కాకూడదని నేను అనుకుంటూ నా పిల్లలని అదేవిధంగా నా తల్లిదండ్రులను ప్రేమిస్తూనే ఉంటాను అంటూ ఐశ్వర్య కీలక కామెంట్లు చేశారు. దీంతో ఐశ్వర్య చేసిన కామెంట్లు ఇప్పుడు తమిళ సినిమా రంగంలో చర్చనీయాంశంగా మారాయి.