Janasena: తెలుగు తెర పవర్ స్టార్, జనసేనాని అయినటువంటి మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారు మంచి దూకుడు మీద ఉన్నట్టు కనిపిస్తోంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉండగానే, చేయవలసిన పనులను ఇప్పటినుండే షురూ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పై ఫోకస్ పెట్టడంతో జనసేన పార్టీ కూడా క్రియాశీల సభ్యత్వ నమోదుపై దృష్టిని కేంద్రీకరించింది. దీనికోసం జనసైనికులు, వీర మహిళలకు విజ్ఞప్తి చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్..
Prabhas: ప్రభాస్తో సినిమా అంటే ఇంకా నమ్మడం లేదు..ఆ దర్శకుడికి అంత రేంజ్ లేదా..?
Janasena: వీడియో కంటెంట్:
ఈ నెల అనగా పిబ్రవరి 21వ తేదీ నుంచి జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం స్టార్ట్ అవ్వబోతుందని జనసేనాని ప్రకటించారు. అందువలన జనసేన క్రియాశీల సభ్యత్వ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలని తన జనసేన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.. ప్రతీ నియోజకవర్గంలో కనీసం 2 వేల మంది క్రియాశీల సభ్యత్వం తీసుకునేలా చూడాలని సూచించారు. అప్పుడే పార్టీ క్షేత్ర స్థాయిలో బలోపేతం అవుతోందని వెల్లడించారు.
Bhumika: ఆ సూపర్ హిట్ సాంగ్కి భూమిక డ్యాన్స్ ఇరగదీసిందిగా.. వీడియో వైరల్!
లక్ష మందికి కోటి రూపాయిల బీమా సౌకర్యం?
పార్టీని మరింత బలోపేతం చేసేలా క్రియాశీల సభ్యత్వ కార్యక్రమం ముమ్మురం చేయాలని ఈ నేపథ్యంలో చెప్పారు. అలాగే గతంలో జనసేన సభ్యత్వం తీసుకున్న వారికి బీమా సౌకర్యం కల్పించామని అన్నారు. సుమారు లక్ష మందికి పైగా ఈ బీమా సౌకర్యం వర్తిస్తుందని అన్నారు. చనిపోయిన కార్యకర్తలకు అండగా నిలిచామని, అలాంటివారి కుటుంబాలకు కూడా జీవితాంతం వెన్నంటే ఉంటామని మాటిచ్చారు. పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జనసైనికులు చురుకుగా పాల్గొనాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.