Radhe Shyam: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన తొలి చిత్రం `రాధేశ్యామ్`. గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భారీ బడ్జెట్తో నిర్మితమైన ఈ సినిమాకు కె.రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. యూరప్ నేపథ్యంలో జరిగే పీరియాడికల్ లవ్స్టోరిగా ఈ సినిమాను రూపొందించారు.
ఇందులో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా ప్రభాస్, ఆయన ప్రేయసి ప్రేరణగా పూజా నటించారు. అనేక అడ్డంకులను దాటుకుని ఎట్టకేలకు ఈ చిత్రం మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఐదు భాషల్లో రిలీజ్ అయింది. కానీ, ప్రేక్షకులను అంచనాలను ఈ మూవీ ఏ మాత్రం రీజ్ కాలేకపోయింది.
ప్రభాస్ నటన, విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మినహా.. పెద్దగా ఆకర్షించే అంశాలు ఏమీ ఈ సినిమాలో ఉండవు. అయితే ప్రభాస్కు ఉన్న క్రేజ్ దృష్యా మొదటి మూడు రోజులు బాగానే కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ.. ఆ తర్వాత పూర్తిగా డల్ అయిపోయింది. ఇక తాజాగా ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ బయటకు వచ్చాయి. వాటిని ఓసారి గమనిస్తే..
నైజాం- రూ. 24.80 కోట్లు
సీడెడ్- రూ. 7.46 కోట్లు
ఉత్తరాంధ్ర- రూ. 4.90 కోట్లు
ఈస్ట్- రూ. 4.34 కోట్లు
వెస్ట్- రూ. 3.32 కోట్లు
గుంటూరు- రూ. 4.50 కోట్లు
కృష్ణ- రూ. 2.71 కోట్లు
నెల్లూరు- రూ. 2.14 కోట్లు
—————————
ఏపీ+తెలంగాణ= రూ. 54.17 కోట్లు (రూ.84.60కోట్ల గ్రాస్)
—————————
తమిళనాడు- రూ. 0.76 కోట్లు
కేరళ- రూ. 0.18 కోట్లు
కర్ణాటక- రూ. 4.20 కోట్లు
హిందీ- రూ. 10.70 కోట్లు
ఓవర్సీస్- రూ. 11.42 కోట్లు
—————————
వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్= రూ. 83.12 కోట్లు (రూ.151కోట్ల గ్రాస్)
—————————
ప్రపంచవ్యాప్తంగా రూ. 208 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన రాధేశ్యామ్.. రూ.210 కోట్ల టార్గెట్తో బరిలోకి దిగింది. అయితే ఈ చిత్రం లాంగ్ రన్లో రూ. 83.12 కోట్ల షేర్ను మాత్రమే వసూల్ చేయడంతో.. బయ్యర్లకు రూ.126 కోట్ల వరకు లాస్ వచ్చిందని అంటున్నారు. మొత్తానికి రాధేశ్యామ్తో ప్రభాస్ తన ఖాతాలో మరో బిగ్ డిజాస్టర్ను వేసుకున్నారు.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!