Roja- Raghava: బుల్లి తెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలలో జబర్దస్త్ కామెడీ షో ఒకటని చెప్పవచ్చు.ఈ టీవీలో ప్రతి గురువారం ప్రసారమయ్యే ఈ షో ద్వారా కమెడియన్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ అందరినీ ఆకట్టుకుంటారు. ఈ కామెడీ షో ఎంతో మందికి లైఫ్ కూడా ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ షో ద్వారా కమెడియన్లు వివిధ రకాల స్కిట్ ద్వారా అందరినీ నవ్విస్తూఉంటారు. ఇక ఈ షో ప్రారంభమైనప్పటినుంచి ఈ షోలో ఎంతో చురుగ్గా పాల్గొనే కమెడియన్ లలో చంటి, రాఘవ, హైపర్ ఆది ముందుంటారు. ప్రతి గురువారం ఈ కామెడీ ఎపిసోడ్ ఈటీవీ లో ప్రసారం అవుతుంది. రాబోయే గురువారం ప్రసారమయ్యే ఈ కామెడీ షో ప్రోమోను విడుదల చేశారు.
ఈ ప్రోమోలో భాగంగా రాకెట్ రాఘవ చేసే స్కిట్ లో రాఘవ తన భార్యకు నిద్రలో లేచి నడిచే అలవాటు ఉందని చెబుతాడు. ప్రతిరోజు తనని పిలుచుకొని వచ్చేసరికి అర్ధరాత్రి అవుతుంది. మరి తను లేచి నడుచుకుంటూ వెళ్లి వచ్చేసరికి నా బ్రతుకు తెల్లారిపోతుంది అంటూ చమత్కరించాడు.ఈ నడిచేదేదో ఎలక్షన్స్ లో నడుచుకుంటే వార్డు మెంబర్ అయ్యేవాడిని అనగా… అందుకు రోజా ఏం పర్లేదులే ఎమ్మెల్యే అయ్యేవాడిని అని చెప్పు అనగా అందుకు రాఘవ చేతులలో వద్దు అంటూ చెబుతాడు.
ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న రోజా:
ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షో లో జడ్జిగా వ్యవహరిస్తున్న రోజా 2014, 19 ఎన్నికలలో నగరి ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి మనకు తెలిసిందే.ఎమ్మెల్యే కాకముందు రోజా కూడా పాదయాత్ర చేయడంతో ఇప్పుడు రాఘవ చేసిన స్కిట్ సింక్ అయినట్లు, ఎంతో ఫన్నీగా అనిపించింది. అదే విధంగా ఈ ప్రోమోలో హైపర్ ఆది దొరబాబు ఇద్దరు కలిసి తమదైన శైలిలో కామెడీ చేసి మరోసారి ప్రేక్షకులను నవ్వించారు. గురువారం ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ కమెడియన్లు చేసే పూర్తి కామెడీ చూడాలంటే గురువారం వరకు వేచి ఉండాల్సిందే.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!