యాంగ్రీ స్టార్ డా. రాజశేఖర్ కొత్త సినిమాను ప్రారంభించబోతున్నారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సరికొత్త తరహా కథాంశంతో ఎమోషనల్ థ్రిల్లర్గా రూపొందనున్న ఈ సినిమాను క్రియేటివ్ ఎంటర్ టైనర్స్ అండ్ డిస్ర్టిబ్యూటర్స్ అధినేత డా. జి. ధనుంజయన్ నిర్మిస్తున్నారు. సినిమాలో సత్యరాజ్, నాజర్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించనున్నారు. ఇటీవల విడుదలైన ‘కిల్లర్’ సినిమాకు సంగీతాన్ని అందించిన సైమన్. కె. కింగ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించబోతున్నారు. ప్రదీప్ కృష్ణమూర్తి ఈ సినిమాకు మెగాఫోన్ పట్టనున్నారు. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రాజశేఖర్ సరసన నందితాశ్వేత హీరోయిన్గా నటించనున్నారు. త్వరలోనే అధికారిక సమాచారం వెలువడనుంది.
previous post