Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ గత ఏడాది నటించిన “జైలర్” సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. రజనీ కెరియర్ లోనే అతిపెద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఏకంగా ₹600 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించటం జరిగింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రజనీకాంత్ ఓల్డ్ క్యారెక్టర్ చేసి.. అద్భుతమైన హీరోయిజం పండించారు. ప్రధానంగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ అందించిన సంగీతం.. సినిమాని నెక్స్ట్ లెవెల్ లోకి తీసుకెళ్లింది. ఇదే విషయాన్ని సినిమా విజయం సాధించిన తర్వాత రజనీకాంత్ తెలియజేశారు. సినిమా తీసింది ఒక ఎత్తు అయితే అనిరుద్ చేతిలోకి వెళ్ళాక… బ్లాక్ బస్టర్ అయిందని వ్యాఖ్యానించారు.
అయితే “జైలర్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అర్థమైందా రాజా అంటూ రజనీకాంత్ చాలా సీరియస్ స్పీచ్ ఇవ్వటం జరిగింది. మొరగని కుక్క లేదు విమర్శించని నోరు లేదు… ఇవి రెండు జరగని ఊరు లేదు. మనం మన పనిచేసుకుంటూ పోతూనే ఉండాలి. అర్థమైందా రాజా అంటూ తన జీవితంలో ఎదురైన పరిస్థితులను వివరించడం జరిగింది. అయితే అప్పట్లో రజిని ఇచ్చిన స్పీచ్ సోషల్ మీడియాలో చర్చినియాంశంగా మారింది. రజిని మాటలు విజయ్ దళపతిని ఉద్దేశించే చేశారని కోలీవుడ్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది.
ఈ క్రమంలో తాజాగా “లాల్ సలామ్” ఈవెంట్ లో రజనీకాంత్ మాట్లాడుతూ.. “జైలర్” ఈవెంట్ లో అర్థమైందా రాజా అంటూ చేసిన వ్యాఖ్యలు.. తప్పుగా ప్రచారం చేశారు. నేను చెప్పిన మాటలు విజయ్ దళపతి పై కావాలనే మాట్లాడినట్లు దుష్ప్రచారం చేశారు. అప్పుడు చాలా బాధ అనిపించింది. విజయ్ చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. నా కళ్ళ ముందు పెరిగాడు. ఎంతో పట్టుదలతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. అలాంటి వ్యక్తిపై నేనెందుకు కామెంట్ చేస్తాను. నాకు ఎవరితో పోటీ ఉండదు…నాకు నేనే పోటీగా ఉంటాను. మా ఇద్దరిని పోల్చి చూడకండి అంటూ రజనీకాంత్ క్లారిటీ ఇవ్వటం జరిగింది.