పాలిటిక్స్ పట్ల ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై క్లారిటీ విషయం తెలిసిందే. ఆయన ఈ విషయాన్ని డిసెంబర్ 3న ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. జనవరిలో కొత్త పార్టీ పెట్టనున్నట్లు.. డిసెంబర్ 31న పార్టీకి సంబంధించిన వివరాలు వెల్లడిస్తానని స్పష్టం చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 234 స్థానాల్లో పోటీ చేస్తుందని రజిని తెలిపారు. ప్రస్తుతం పార్టీ చిహ్నం కోసం పార్టీలో తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి.
ముఖ్య నేతలు గురువారం సమావేశమయ్యారు . పార్టీ పేరు, చిహ్నం, జెండా విషయాలపై అర్జున్ మూర్తి, తమిళరివి మణియన్ మక్కల్ మండ్రం జిల్లా కార్యదర్శులతో భేటీ అయ్యారు. గంటల తరబడి చర్చించి అన్ని సిద్ధం చేసి రజినీ వద్దకు తీసుకెళ్లేందుకు
సమావేశంలో నిర్ణయించినట్టు సమాచారం.
రజినీకాంత్ రాజకీయ ప్రకటన సమయం దగ్గర పడుతుండటంతో సైకిల్ గుర్తు కీలకం కానుంది. అన్నామలై చిత్రంలో తలైవా గెటప్ ను తలపించే విధంగా సైకిల్, పాలక్యాన్ తో ఉన్న స్టిల్ ను రాజకీయ చిహ్నంగా ఎంపిక చేయటానికి పార్టీ వర్గం నిర్ణయించినట్టు తెలిసింది. దీనిపై తుది నిర్ణయం రజినీకాంత్ తీసుకోవాల్సిందిగా మక్కల్ మండ్రం నిర్వాహకులు తెలిపారు.
రజినీకాంత్ సోదరుడు సత్యనారాయణ గురువారం తిరువణ్ణామలైకు వెళ్లారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 31న పార్టీ ప్రకటన చేయటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు జనవరిలో కొత్త పార్టీ ప్రకటించడంతో పాటు పార్టీ జెండాతో పాటు ఎజెండాను వెల్లడించనున్నారు. ఇక ఎజెండా విషయంలో తాను తమిళనాడులో ద్రవిడ పార్టీలకు భిన్నంగా ఆధ్యాత్మిక రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా ఇప్పటికే వరకు రజినీకాంత్ అభిమానులకు సంబంధించిన మక్కల్ మండ్రం పార్టీ విధి విధానాలను రూప కల్పన చేసే పనిలో పడ్డాయి.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!