టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ కి ఒకప్పుడున్న క్రేజ్ మామూలుది కాదు. టాప్ హీరోయిన్ గా చలామణి అయింది. కోటి రూపాయలకి పైగానే రెమ్యూనరేషన్ అందుకుంది. మెగా హీరోలకి లక్కీ హీరోయిన్ గా మారింది. అంతేకాదు రకుల్ కోసం స్టార్స్ కూడా రికమెండ్ చేశారు. ఇక చిన్న సినిమాతో టాలీవుడ్ కి వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ నాలుగేళ్ళ పాటు టాలీవుడ్ ని ఏలిందనే చెప్పాలి. ఈ నాలుగేళ్ళలో మన హీరోలు ఇంకో హీరోయిన్ ని కూడా అంతగా పట్టించుకోలేదు.
టాలీవుడ్ స్టార్స్ తో చేసిన దాదాపు అన్నీ సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నాయి. ఎన్.టి.ఆర్ తో నాన్నకు ప్రేమతో..రాం చరణ్ తో ధృవ..నాగ చైతన్య తో రారండోయ్ వేడుకూ చూద్దాం..గోపీచంద్ సినిమా..ఇలా మంచి కమర్షియల్ సక్సస్ లను అందుకుంది. కాని ఉన్నపలంగా కెరీర్ డౌన్ అయింది. అందులో రకుల్ పొరపాట్లే ఎక్కువగా ఉన్నాయి. టాలీవుడ్ లో ఊపిరి తీసుకోలేనంత బిజీగా ఉన్నాకూడా తమిళ ..హిందీ భాషల్లో సినిమాల కోసం వెంపర్లాడింది.
అదే తన కెరీర్ ని చిక్కుల్లో పడేసింది. ఎలాగోలా మళ్ళీ నాగార్జున నటించిన మన్మధుడు 2 లో అవకాశం వస్తే అది తన కెరీర్ నే దాదాపు క్లోజ్ చేసింది. చెప్పాలంటే ఈ సినిమా ఒప్పుకొని కూడా రకుల్ పెద్ద పొరపాటే చేసింది. అయితే ఇలాంటి పొరపాట్లలో మరో రెండు కూడా ఉన్నాయి. పూరి జగన్నాధ్ ఒక సినిమా కోసం 60 రోజులు డేట్స్ అడిగితే పది రోజులిస్తా అని చెప్పిందట. దాంతో పూరి తీసి పక్కన పెట్టాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయిందట. అలాగే నాగ చైతన్య నటించిన ఆటో నగర్ సూర్య లో కూడా ఛాన్స్ వస్తే వదులుకుందట. ఇక ఏకంగా ప్రభాస్ సినిమాకైతే మేకప్ టెస్ట్ జరిగి అంతా ఓకే అనుకుని పక్కన పెట్టారు. అదే క్యారెక్టర్ కాజల్ అగర్వాల్ చేసింది. మొత్తానికి రకుల్ కెరీర్ లో పూరి లాంటి స్టార్ డైరెక్టర్స్ ఇచ్చిన ఆఫర్స్ ని కాదనుకొని ఇప్పుడిలా తయారైందట.