Rashi Khanna: `మనం` సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అందాల భామ రాశీ ఖన్నా.. `ఊహలు గుసగుసలాడే`తో గుర్తింపు పొందింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసి తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటిస్తూ సత్తా చాటుతోంది.
ఇప్పటికే తెలుగులో ఈమె చేసిన `థాంక్యూ`, `పక్కా కమర్షియల్` చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే తమిళంలో నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన రాశీ.. బాలీవుడ్లో సిద్ధార్థ్ మల్హోత్రాతో `యోధ`, షాహిద్ కపూర్తో ఓ సినిమా చేస్తోంది. వీటితో పాటు రాజ్ అండ్ డీకే డైరక్ట్ చేస్తున్న వెబ్సీరీస్కి సైతం సైన్ చేసింది.
ఇదిలా ఉంటే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశీ ఖన్నా.. కెరీర్ స్టార్టింగ్లో తను ఎదుర్కొన్న బాడీ షేమింగ్ గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే.. ` హీరోయిన్గా అడుగులు వేస్తున్న సమయంలో చాలా మంచి అవకాశాలు వచ్చాయి.. కానీ అదే సమయంలో నా శరీరాకృతిపై ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాను. నాకు పీసీఓడీ వ్యాధి ఉంది. అందువల్లే నేను కెరీర్ స్టార్టింగ్లో బొద్దుగా ఉండేదాన్ని.
అది తెలుసుకోకుండా చాలా మంది నన్ను గ్యాస్ ట్యాంకర్ అని పిలిచేవారు. ఎంతో బాధ కలిగేది. హీరోయిన్గా కొనసాగాలన్నా, అందంగా కనిపించాలన్నా సన్నగా ఉండటం ఎంతో ముఖ్యం. అందుకే ఎవరో అవమానించారని కాకుండా.. కెరీర్ కోసం ఫిట్నెస్పై శ్రద్ద పెట్టి నాజూగా మారాను` అంటూ రాశీ చెప్పుకొచ్చింది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!