పదవులు పోయినా, ప్రాణాలు పోయినా, అయిన వారు వద్దూ వద్దన్నా లక్ష్మి పార్వతి చేయి వదలని ‘ఎన్టీఆర్’ ప్రేమకథను వాలంటైన్స్ డే సందర్భంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ ట్రైలర్ రూపంలో ఆర్జీవి నారా నందమూరి కుటుంబ సభ్యులపై ఒక బండరాయి విసరబోతున్నాడు. “ఇది కుటుంబ కుట్రల చిత్రం” అనే ట్యాగ్ లైన్ తో రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వటమే కాకుండా చాలామందికి చెమటలు పుట్టిస్తోంది
అండగా నిలబడలేకపోయిన ఆయన కుటుంబ సభ్యులకు, నమ్మకంగా లేని అనుచరులకు, వెన్నుపోటుపొడిచిన కుట్ర దారులకు లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ ఓ ముందుపోటులా ఉంటుంది. ఈ కథను వర్మ ప్రత్యేక శ్రద్ధ పెట్టి తీసి ఉంటాడని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాంగోపాల్ వర్మ చెప్పబోయే ఈ కథ, ఎన్టీఆర్ మంచిలోని విషయాలే కాదు, సొంత ఫ్యామిలీ వాళ్ళు చేసిన చెప్పుకోలేని పనులను కూడా అడ్డుకోలేని ఆయన అమాయకత్వాన్ని చూపెట్టబోతోంది. అందుకే ఈ కథ నిజాలనే కత్తులతో మూకుమ్మడి దాడి చేయబోతోంది, అందరికీ తెలిసిన కథలో ఎవ్వరికీ తెలియని కథనాన్ని వెలికితీయబోతుంది. త్వరలో విడుదలకు సిద్దం అవుతున్న ‘ఎన్టీఆర్ అసలు కథ’ తెలుగు తెరపై లక్ష్మీ ఆటం బాంబులను పేల్చడానికి సిద్దం అవుతోంది. వెలుగులు పంచిన వ్యక్తి చుట్టూ అలుముకున్న చీకట్లను తెరమీదకు తీసుకురావడానికి వర్మ రెడీ అవుతున్నాడు. రామ్ గోపాల్ వర్మ ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఎలా ఉండబోతోందో తెలిపే ట్రైలర్ ను ఫిబ్రవరి 14 న ఉదయం 9 గంటల 27 నిమిషాలకు చాలామంది వీపులలో గుచ్చబోతున్నాడు.
తెలుగు ప్రజలకు ఆరాధ్య దైవంగా, తెలుగు ఖ్యాతిని నలుదిశలా చేరవేసిన ఎన్టీఆర్ లోలోపలే నిర్వీర్యమైన ఒక ప్రేమకథను “లక్ష్మీస్ ఎన్టీఆర్ “లో రాంగోపాల్ వర్మ ఆవిష్కరించబోతున్నాడు. తుది శ్వాస వదలే వరకూ లక్ష్మీ పార్వతి గౌరవాన్ని కాపాడిన ఎన్టీఆర్ జీవితంపై ఆమె ఎలాంటి ప్రభావం చూపించింది? లక్ష్మీ కోసం తనవనే వన్నీ పణంగా పెట్టి పోరాడిన ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిల మద్య అతి రహస్యమైన సంబంధం ఏంటి? విడదీయరాని ఆ ఆపవిత్ర బంధం ఎంటి..? ఇలాంటి అంశాలు కొందరికి రుచించకపోయినా, అవి తెలుగుప్రజల గొంతుల్లోకి దిగాల్సిన అవసరముంది కనుకనే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాని తీస్తున్నాని వర్మ అంటున్నాడు.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!