Sai Pallavi: “విరాటపర్వం” ప్రమోషన్ కార్యక్రమాలలో సాయి పల్లవి “కాశ్మీర్ ఫైల్స్”, గో రక్షకుల పై చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. సాయి పల్లవి చేసిన కామెంట్లపై కొంతమంది పోలీస్ స్టేషన్ లో ఆమెపై ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో హీరోయిన్ సాయి పల్లవి పై బజరంగ్ దల్ నాయకులు కేసు పెట్టడం జరిగింది. ఇష్టానుసారంగా “కాశ్మీర్ ఫైల్స్” సినిమాతో పాటు గో రక్షకులు పైన కాంట్రవర్సి కామెంట్లు చేయడం జరిగిందని ఆరోపించారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అంతమాత్రమే కాకుండా పలు వీడియో ఫుటేజ్ లు కూడా ఆధారంగా పోలీసులకు సమర్పించినట్లు సమాచారం. పరిస్థితి ఇలా ఉంటే తాను చేసిన కాంట్రవర్సీ కామెంట్లపై సాయి పల్లవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రియాక్ట్ కావడం జరిగింది. “విరాట్ పర్వం” ప్రమోషన్ కార్యక్రమంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను చేసిన వ్యాఖ్యలకు కచ్చితంగా సమాధానం చెబుతానని కానీ ఇప్పుడు.. సందర్భం కాదని స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం “విరాట పర్వం” సినిమా యే ముఖ్యమని… స్పష్టం చేసింది. సినిమా రిలీజ్ అవుతున్న క్రమంలో సంతోషంగా ఉన్నాము.
సినిమా విడుదల తర్వాత ఈ వివాదం గురించి మాట్లాడుకుందామని సాయి పల్లవి పేర్కొంది. ఇదే సందర్భంలో రానా కూడా ఈ మీడియా సమావేశంలో పాల్గొని ఈ వివాదం గురించి మాట్లాడుతూ తాను లేని టైంలో ఇంత జరిగింది. అసలు తాను ఉండి ఉంటే విషయం ఇక్కడ దాకా వచ్చేది కాదని అన్నారు. మరోపక్క సాయిపల్లవి అభిమానులు ఎట్లాగైనా ఈ వివాదం నుండి బయటకు రావాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే నేడు రెండు తెలుగు రాష్ట్రాలలో “విరాటపర్వం” భారీ ఎత్తున రిలీజ్ అయింది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!