ప్రస్తుతం ఇండియా వెస్టిండీస్ టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు వండే మ్యాచ్ లు జరగగా ప్రస్తుతం టి20 మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఇండియా మంచి విజయాలు సాధిస్తూ ఉంది. ఈ క్రమంలో తాజాగా జరుగుతున్న టి20 మ్యాచ్ లో హీరోయిన్ సమంత క్రేజ్ ఒక్కసారిగా పెంచేసిన సాంగ్ వేసి గ్యాలరీలో ఉన్న ప్రేక్షకులు డాన్సులు వేశారు. మేటర్ లోకి వెళ్తే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమాలలో పుష్ప ఒకటి. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప” పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కి ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ దక్కించుకుంది.
సినిమాలో పాటలు మరియు అల్లు అర్జున్ మేనరిజం ఇంకా డైలాగులు చాలా హైలెట్ అయ్యాయి. సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీలు “పుష్ప” డైలాగులతో సోషల్ మీడియా షేక్ చేసేసారు. తగ్గేదేలే… డైలాగ్ తో పాటు శ్రీవల్లి సాంగ్ లో బన్నీ వేసిన స్టెప్పులతో అంతర్జాతీయ క్రీడాకారుల సైతం సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమాలో “ఉ అంటావా మావ..ఊఊ అంటావా మావ” సాంగ్ సినిమాకే హైలెట్ గా నిలవడం తెలిసిందే.
ఐటమ్ సాంగ్ గా ఈ పాటలో సమంత వేసిన స్టెప్పులు.. ఇచ్చిన హావ భావాలు.. చాలామంది ఆకట్టుకోవడం జరిగింది. అంతేకాదు ఈ సాంగ్ బాలీవుడ్ కండల వీడు సల్మాన్ ఖాన్ కి కూడా ఇష్టమైన సాంగ్. ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో “ఉ అంటావా మావ..ఊఊ అంటావా మావ” సాంగ్ ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది. తాజాగా ఇదే సాంగ్ తో ఇండియా వెస్టిండీస్ మ్యాచ్ లో ఆడియన్స్ స్టెప్పులు వేయటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!