Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ చిత్రం యశోద.. ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.. ఈ చిత్రం 21.45 కోట్లను వసూలు చేసింది.. ఈ సినిమా హిట్ అయిన సందర్భంగా సమంత ఎమోషనల్ ట్వీట్ చేసింది.. పౌరాణిక పాత్రలో సమంత నటించిన చిత్రం శాకుంతలం.. తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ను ఓ ప్రముఖ సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది..
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం సినిమాలో సమంత మొదటి సారి పౌరాణిక పాత్రలో నటించింది. గతంలో డైరెక్టర్ భారీ సెట్ వేయగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. యశోద తో చేతినిండా లాభాలను గడిస్తున్న రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ సంస్థే శాకుంతలం సినిమాని ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూట్ చేసేందుకు రెడీ అయింది. శాకుంతలం అన్ని భాషల ఓవర్సీస్ రైట్స్ రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ సంస్థే కొనుగోలు చేసినట్టు సమాచారం.
ఈ సినిమాలో దేవ్ మోహన్ రాజ్ దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. గుణ టీమ్ వర్క్స్ పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, తమిళ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. యశోద సినిమా హిట్ అవ్వడంతో శాకుంతలం సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.