డైరెక్టర్ నుంచి హీరోగా మారిన వీవీ వినాయక్ చేస్తున్న తొలి సినిమా ‘సీనయ్య’. స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలనే ప్రధాన అంశంగా తీసుకుని తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ‘శరభ’ ఫేమ్ ఎన్. నరసింహ దర్శకత్వం వహిస్తుండగా.. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో వినాయక్ సరసన ఎవరు నటిస్తున్నారనే అంశంపై ఇప్పటి వరకు రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. మొదట శ్రియ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరగింది. అయితే అది వట్టి ప్రచారమని తేలిపోయింది. తాజా సమాచారాన్ని బట్టి.. ఒకనాటి హీరోయిన్ సంగీతను ఆ అవకాశం వరించిందట. మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సంగీత.. తాజాగా ఈ సినిమాకు అంగీకరించారట.
previous post
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!