మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టి తెలుగులో `స్వాతికిరణం`చిత్రంలో నటించేటప్పుడు ఇదేంటి? మలయాళ నటుడ్ని తీసుకొస్తున్నారు. ఆయన ఇక్కడి ప్రేక్షకులకు కనెక్ట్ అవుతారా? అని అనుకున్నాడట నిర్మాత అల్లు అరవింద్. అప్పటికి అరవింద్కు మమ్ముట్టి గురించి తెలియదట. సినిమా చూస్తున్నంతసేపు మమ్ముట్టి నటనను చూస్తూ అలా కూర్చునుండిపోయాడట. తర్వాత ఓ సందర్భంలో అరవింద్, మమ్ముట్టికి ఫోన్ చేసి పవన్కల్యాణ్ సినిమాలో విలన్గా నటిస్తారా? అని అడిగాడట. దానికి ఆయన `ఇదే ప్రశ్నను మీరు చిరంజీవిని అడుగుతారా?` అని అనగానే అడగలేనని అరవింద్ చెప్పాడట. మమ్ముట్టి నవ్వుతూ ఫోన్ పెట్టేశాడట. ఈ విషయాన్ని చెప్పిందెవరు కాదు.. స్వయంగా అల్లు అరవిందే. మమ్ముట్టి నటించిన `మామాంగం` సినిమా ప్రెస్మీట్లో మాట్లాడుతూ ఈ విషయాన్ని అరవింద్ వెల్లడించారు.
previous post
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?