మాస్ మహారాజా రవితేజ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా క్రాక్. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్దంగా ఉంది. రవితేజ గోపీచంద్ మలినేలి కాంబినేషన్ లో వస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. గతంలోను రవితేజ తో బలువు సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాకి దర్శకుడు గోపీచంద్ మలినేని. మరో సారి ఈ ముగ్గురి కాంబినేషన్ లో క్రాక్ వస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపుగా మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ‘వకీల్ సాబ్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్..కోలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ సినిమాకు రీమేక్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించే హీరోయిన్ ఎవరు అన్నది ఇంకా చిత్ర బృందం తెలపలేదు. అయితే కొన్నాళ్ళుగా మాత్రం ఈ సినిమాలో పవన్ సరసన నటించే హీరోయిన్ శృతి హాసన్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
గబ్బర్ సింగ్ – కాటమరాయుడు సినిమాల తర్వాత శృతి పవన్ తో ఇదే హ్యాట్రిక్ సినిమా అని పవర్ స్టార్ చెప్పుకుంటున్నారు. అయితే శృతిహాసన్ వకీల్ సాబ్ లో హీరోయిన్ గా నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో తనకు ఇంకా క్లారిటి లేదని చెప్పింది. ఇప్పట్లో ఈ విషయం గురించి చెప్పడం కూడా కష్టమని వెల్లడించింది. అంటే దీని బట్టి చూస్తే 50-50 ఛాన్సెస్ అని అర్థమవుతుంది. ఇక గతంలో మాత్రం దర్శకుడు శృతిహాసన్ పేరు మాత్రం ప్రస్తావనకి తీసుకు వచ్చాడు.