Shruti Haasan: సంక్రాంతి పండుగ నేపథ్యంలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చిరంజీవి మరియు బాలకృష్ణ సినిమాలు రిలీజ్ కావటం తెలిసిందే. జనవరి 12వ తారీకు బాలకృష్ణ “వీరసింహారెడ్డి”, జనవరి 13వ తారీకు చిరంజీవి “వాల్తేరు వీరయ్య” రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలలో శృతిహాసన్ హీరోయిన్ అని అందరికీ తెలుసు. అయితే “వీరసింహారెడ్డి” సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకకు వచ్చిన శృతిహాసన్.. “వాల్తేరు వీరయ్య” ప్రీ రిలీజ్ వేడుకకు గైర్హాజరైంది. ఈ క్రమంలో చిరంజీవి ఒంగోలులో “వీరసింహారెడ్డి” కార్యక్రమంలో శృతిహాసన్ నీ ఎవరో బెదిరించారు జ్వరం వచ్చేసింది అంటూ చమత్కరించారు.
దీంతో మెగా అభిమానులు శృతిహాసన్ పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే తనకి ఫుల్ ఫీవర్ రావడంతో… వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ వేడుకకు రాలేకపోతున్నట్లు క్లారిటీ ఇచ్చింది. అదే సమయంలో సినిమా హిట్ అవ్వాలని ఇంకా చిరంజీవి వంటి లెజెండ్ హీరోతో నటించడం తన అదృష్టం అని చెప్పుకోచ్చింది. ఇదిలా ఉంటే శృతిహాసన్ మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు ఇటీవల వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. దీంతో తనకి అనారోగ్యం అంటూ మానసిక వ్యాధి అంటూ వస్తున్న వార్తలపై శృతిహాసన్ సీరియస్ అయ్యి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టడం జరిగింది.
“ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ.. కొందరు తమ హెల్త్ ఇష్యూస్ నీ బయటికి చెప్పుకునేందుకు కూడా భయపెట్టేలా చేస్తున్నారు. నాకు వచ్చిన వైరల్ ఫీవర్ నువ్వు ఆరీతిగానే వేరే రకంగా మార్చేశారు. బాగా ట్రై చేశారు. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. మీకు అలాంటి సమస్య ఉంటే తెరపిస్ట్ నీ కలవండి. ప్రస్తుతం నేను ఫీవర్ నుండి కోరుకుంటున్నా అని శృతిహాసన్ తనదైన శైలిలో తన అనారోగ్య వార్తలపై కౌంటర్ ఇవ్వడం జరిగింది.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!