లాక్ డౌన్ తర్వాత రవితేజ నటించిన ‘క్రాక్’ సినిమాతో అదిరిపోయే హిట్ తన ఖాతాలో వేసుకుంది శృతిహసన్. కరోనా వైరస్ రాకముందు శృతిహాసన్ చాలా వరకు సినిమాలకు దూరం అవుతూ అప్పట్లో అవకాశాలు కూడా అందుకోలేకపోయింది. కానీ తాజాగా క్రాక్ సినిమాతో ఈ అమ్మడు బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు శృతి ఫాన్స్.
సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చిన ‘క్రాక్’ సినిమా రవితేజ కి కోల్పోయిన మార్కెట్ తిరిగి తెచ్చిపెట్టింది. గత కొన్ని రోజుల నుండి వరుస ఫ్లాపులు చూస్తున్న రవితేజ ఈ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. సినిమా హాల్లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఇటువంటి తరుణంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి ముచ్చట్లు చెబుతున్న తరుణంలో పవన్ తో చేస్తున్న వకీల్ సాబ్ సినిమా గురించి క్లారిటీ ఇచ్చింది.
ఆ సినిమాలో తాను హీరోయిన్ అన్నట్లుగా వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కొట్టిపారేసింది. “వకీల్ సాబ్” సినిమాలో ఫుల్ లెంత్ హీరోయిన్ పాత్ర ఏమీ లేదని, నా పాత్ర కేవలం కొద్ది రోజులు అది కూడా గెస్ట్ రోల్ తరహాలో ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది. పాత్ర బాగుండటంతో పాటు పవన్ సినిమా కావడంతో ఆ అవకాశాన్ని వదులు కోలేదు అని శృతిహాసన్ క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉండగా బాలీవుడ్ ఇండస్ట్రీ లో అవకాశాలు అనుకుంటున్నట్లు నెక్స్ట్ సినిమా బాలీవుడ్ లోనే అన్నట్టు తాజా ఇంటర్వ్యూలో శృతి తెలిపింది.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!