Yatra 2: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్య మంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మనందరికీ సుపరిచితమే. ఈయన జీవిత చరిత్రని ఓ సినిమా లాగా తీసిన సంగతి తెలిసిందే. దాని పేరే యాత్ర. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా ” యాత్ర 2 ” ఫిబ్రవరి 8న రిలీజ్ కానుంది.
వైయస్సార్ తనయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎదిగిన తీరు 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయాలను ఈ సినిమా ఆధారంగా ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నాడు. ఇక ఈ సినిమాని డైరెక్టర్ మహి వి. రఘవ్ తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ మూవీలో వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో ముమ్మట్టి , వైయస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో జీవా నటించారు.
ఇక ఇటీవలే విడుదలైన యాత్ర 2 టీజర్ మరియు సాంగ్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ” పుట్టుకతోనే చెవుడు ఉంది అన్న. చెవుడు వల్ల మాటలు కూడా రావు. ఏదో మిషన్ పెడితే వినబడి మాటలు వస్తాయని డాక్టర్లు చెప్పారు.
అన్న మాకు అంత స్తోమత లేదు ” అనే ఓ కూతురి ఆవేదనను సీఎంతో చెప్పుకుంటూ ఉంటుంది. ఇదే ట్రైలర్ స్టార్టింగ్. “క్రెడిబిలిటీ లేని రోజు మా నాయన లేడు. నేను లేను. నేను విన్నాను.. నేను ఉన్నాను ” అనే భారీ డైలాగులతో సాగే మాటలు తో ఈ ట్రైలర్ మొదలయ్యి ఎండ్ అయింది. ఇక ఈ ట్రైలర్ ని చూసిన కొందరు.. ఇవి చెప్పుకోవడానికి తప్ప చేసింది ఏమీ లేదు అంటూ మండిపడుతున్నారు.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!