లాక్ డౌన్ సమయంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ సినిమా హీరో చేయని రీతిలో చాలామందికి హెల్ప్ చేసిన ఘనత సోనుసూద్ దక్కించుకున్నాడు. కరోనా వైరస్ రాకముందు అనేకమంది మేము ఇంత సహాయం చేసాం వారికి నేను అలా ఉపయోగపడను అనే రీతిలో సినిమా వేదికలపై ప్రీ రిలీజ్ ఈవెంట్ లలో డైలాగులు కొట్టిన హీరోలు అసలైన సమయంలో కామ్ గా ఇళ్లల్లో కూర్చున్నారు. కానీ సోనూసూద్ మాత్రం లాక్ డౌన్ సమయం నుండి వలసదారులకు, పేదవాళ్లకు ఇంకా సమాజంలో చాలామందికి ఉపయోగపడుతూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
దీంతో సోనుసూద్ చేస్తున్న పనులకు దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకులు సామాన్యులు ఇతడు నిజమైన రియల్ హీరో అని అంటున్నారు. ఇదిలా ఉండగా ప్రత్యేకంగా తన నుండి సాయం పొందే వాళ్ల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసిన సోనూసూద్…ప్రస్తుతం చేస్తున్న పనులు కంటిన్యూ చేస్తూనే మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేమిటంటే పేద విద్యార్థుల కోసం ఓ ప్రత్యేక స్కాలర్షిప్ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. హయ్యర్ స్టడీస్ కోసం డబ్బులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడే పేద కుటుంబాలకు స్కాలర్ షిప్ లను ఇస్తానని వెల్లడించాడు.
అయితే దీనికి వార్షికాదాయం 2 లక్షలకంటే తక్కువగా ఉండి మంచి మార్కులతో పాస్ అయ్యిన విద్యార్థులు అర్హులని షరతు పెట్టారు. వైద్య, విద్య, ఇంజినీరింగ్, బిజినెస్ స్టడీస్, జర్నలిజం వంటి వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న వారందరూ దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. విద్యార్థులు తమ దరఖాస్తులను 10 రోజుల్లో [email protected] మెయిల్ కు పంపించాలని సోను తెలిపారు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో రావటంతో…కొన్ని వ్యవస్థలు ప్రభుత్వాలు చేయాల్సిన పని సోనూసూద్ చేస్తున్నారని నెటిజన్లు కొనియాడుతున్నారు.
ఖచ్చితంగా అన్ని రకాలుగా చూసుకుంటే సోనూసూద్ కీ భారతరత్న ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులకు ప్రభుత్వాలు ప్రోత్సాహం చూపించి, వారి సేవలను గుర్తిస్తే మరికొంతమంది సమాజం నుండి వస్తారని నెటిజన్లు అంటున్నారు. మామూలుగా అయితే పేదవాళ్ల స్టడీస్ కోసం ప్రభుత్వాలు పట్టించుకుంటాయి. కానీ సోనుసూద్ ప్రత్యేకంగా వారి తల్లిదండ్రులకు పిల్లల చదువు భారం కాకుండా తాను శ్రద్ధ వహించడం మామూలు విషయం కాదని నెటిజన్లు అంటున్నారు.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!