Senthil Kumar: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ భార్య రూహీ అనారోగ్య కారణాల రీత్యా తుది శ్వాస విడవటం జరిగింది. యోగా టీచర్ గా రూహీ బాగా పాపులర్ అయ్యారు. అయితే కరోనా వచ్చిన తర్వాత ఆమె తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. అప్పటినుంచి ఆమె చికిత్స తీసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో ఉన్న కొద్ది ఆమె ఆరోగ్యం క్షీణిస్తూనే ఉంది. దీంతో రూహీ ఆర్గాన్స్ అన్ని ఫెయిల్ అవ్వడంతో మృతి చెందినట్లు వైద్యులు గురువారం తెలియజేయడం జరిగింది.
గతంలో రూహీ చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో కలిసి పనిచేయడం జరిగింది. రూహీ మరణం పట్ల పరిశ్రమ దిగ్బ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. సెంథిల్ కుమార్..రూహీకి 2009వ సంవత్సరంలో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రూహీ మృతి పట్ల సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. రేపు ఉదయం 9 గంటలకు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ గ్రేట్ దర్శకుడు రాజమౌళి దగ్గర “సై” సినిమా నుండి పనిచేస్తూ ఉన్నారు.
వీళ్ళిద్దరి కాంబోలో సై, చత్రపతి, యమదొంగ, మగధీర, ఈగ, బాహుబలి 1, బాహుబలి 2, RRR వచ్చాయి. RRR లో సెంట్రల్ కుమార్ పనితనానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వచ్చాయి. రాజమౌళి సినిమాలు విజయాలు సాధించడంలో సినిమాటోగ్రాఫర్ గా సెంథిల్ కుమార్ మేజర్ రోల్. ఈ విషయాన్ని రాజమౌళితో చేసిన చాలామంది చాలామంది హీరోస్ చెబుతుంటారు. రాజమౌళి విజన్ నీ బాగా అర్థం చేసుకుని వెండితెరపై అద్భుతంగా చూపించడంలో సెంథిల్ కుమార్ బాగా నేర్పరి. రాజమౌళి దగ్గర దాదాపు 20 సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉన్నారు. దీంతో రూహీ.. మరణించడంతో రాజమౌళి టీం కూడా ఎంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!