Trisha: హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా దక్షిణాది సినిమా రంగంలో టాప్ హీరోయిన్ గా రాణిస్తుంది. నాలుగు పదుల వయసు దాటినా కానీ అవకాశాలు విషయంలో.. కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల సౌత్ హీరోయిన్ త్రిష చుట్టూ వివాదాస్పద వాతావరణం ఏర్పడుతుంది. ఆమెపై ఎవరో ఒకరు కామెంట్లు చేస్తూనే ఉన్నారు. కొన్ని వారాల క్రితం మన్సూర్ అలీఖాన్ త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో త్రిషకి చాలామంది మద్దతుగా నిలిచారు. పరిస్థితి ఎలా ఉంటే తాజాగా అన్నాడీఎంకే బహిష్కృత నేత ఏవీ రాజు ఓ మీడియా సమావేశంలో త్రిషపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఆయన మాట్లాడుతూ గతంలో గౌవత్తూరులోని.. ఓ ఫంక్షన్ లో పాల్గొన్న సమయంలో అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆమెపై మనసు పడ్డారు. దీంతో ఆ ఎమ్మెల్యే కోరిక తీర్చడం కోసం 25 లక్షలు తీసుకుని ఆ రాత్రి ఎమ్మెల్యేతో త్రిష గడిపింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాదు ఆరోజు జరిగిన దానికి నేనే సాక్ష్యం అంటూ ఏవీ రాజు వ్యాఖ్యానించారు. నేను తాగిన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. చాలామంది త్రిష అభిమానులు ఏవి రాజు పై మండిపడుతున్నారు.
అంతేకాదు మహిళా సంఘాలతో పాటు సెలబ్రిటీలు ఇంకా రాజకీయ నాయకులు కూడా ఖండిస్తున్నారు. ఆ రాజకీయ నేత చేసిన వ్యాఖ్యలు త్రిష నాకు చేరటంతో ఆమె కూడా స్పందించి నలుగురు దృష్టిలో పడటానికి ఎంతటి దారుణానికైనా దిగజారుతారు అంటూ కౌంటర్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఏవి రాజు పై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటానని.. ఇకపై దీని గురించి ఏం మాట్లాడాలన్నా నా లీగల్ టీమే మాట్లాడుతుంది అని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?