BRS: లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్క్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీని వీడిన కొద్ది గంటల వ్యవధిలోనే మరో సిట్టింగ్ ఎంపీ పార్టీకి రాజీనామా చేయడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుత తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు పంపించారు రంజిత్ రెడ్డి,
చేవెళ్ల ప్రజలకు సేవ చేసే అవకాశాలు ఇచ్చిన కేసిఆర్, కేటిఆర్ కు ధన్యవాదాలు తెలియజేసిన రంజిత్ రెడ్డి .. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. బీఆర్ఎస్ లో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలోనే చేవెళ్ల నుండి మళ్లీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలోనూ రంజిత్ రెడ్డి కే టికెట్ అని స్పష్టం చేశారు.
అయితే ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు, లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్టు తర్వాత బీఆర్ఎస్ ను కీలక నేతలు వీడుతున్నారు. రంజిత్ రెడ్డి భవిష్యత్తు కార్యచరణ ఏమిటనేది దానిపై ప్రకటన చేయలేదు. కానీ ఆయన కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తొంది. అయితే ఆ రెండు పార్టీల్లోనూ ఎంపీ టికెట్ లు వచ్చే అవకాశాలు లేవు. చేవెళ్ల నుండి బీజేపీ అభ్యర్ధిగా ఇప్పటికే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని ప్రకటించగా, కాంగ్రెస్ పార్టీ నుండి మహేందర్ రెడ్డి భార్య సునీతా రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
దీంతో రంజిత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. లోక్ సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుండి పలువురు ముఖ్య నాయకులు ఇతర పార్టీల్లోకి జంప్ అవుతుండటం ఆ పార్టీని కలవరానికి గురి చేస్తొంది.
BJP: ఎట్టకేలకు బీజేపీ గూటికి చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్