TDP: నెల్లూరు జిల్లాలో వైసీపీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు చేతుల మీదుగా వీరిద్దరూ పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఇటీవల వైసీపీకి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు నెల్లూరు డిప్యూటి మేయర్ రూప్ కుమార్ యాదవ్, పలువురు కార్పోరేటర్ లు, సర్పంచ్ లు టీడీపీలో చేరారు.
ఈ సందర్భంగా నెల్లూరు పీవీఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి భారీగా టీడీపీ, జనసేన కార్యకర్తలు హజరైయ్యారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేస్తూనే ఉంటానని అన్నారు. మరింత మందికి సేవ చేయాలనే రాజకీయాల వైపు అడుగేశానని చెప్పారు. టీడీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో ప్రజల అందరి మద్దతు అవసరమని, ప్రజలకు ఉపయోగపడే మరిన్ని మంచి పనులు చేస్తానని అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి టీడీపీలోకి రావడం శుభ పరిణామమన్నారు. రాజకీయాల్లో సంపాదించాలని, దుర్మార్ఘపు పనులు చేయాలనే ఆలోచన వారికి లేదని అన్నారు. వీపీఆర్ లాంటి వారు రాజకీయాల్లో ఉండటం అవసరమని అన్నారు. సొంత డబ్బు ప్రజలకు ఖర్చు పెట్టే మనస్థత్వం వీపీఆర్ దని చంద్రబాబు కొనియాడారు. డిప్యూటి మేయర్ రూప్ కుమార్ ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని అన్నారు. నెల్లూరు పార్లమెంట్ స్థానం ఇక మనదేనని ధీమా వ్యక్తం చేశారు.
నెల్లూరు జిల్లా ఖాళీ అయిపోతోందని.. నెల్లూరు కార్పోరేషన్ కార్పోరేషనే ఖాళీ అయిపోతోందని తెలిపారు. యుద్ధానికి సై అంటూ అంతా ముందుకు వస్తున్నారన్నారు. వేమిరెడ్డి రాకతో సునాయాసంగా గెలవబోతున్నామని అన్నారు. రాజకీయాలకు గౌరవం తెచ్చే వ్యక్తులను పార్టీలోకి స్వాగతిస్తున్నామని తెలిపారు. ప్రశ్నించే వారిని వేధించడమే సీఎం జగన్ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. మన మంతా బానిసలం.. ఆయన రారాజు ..అనుకుంటున్నారని అన్నారు. వ్యక్తులను, ప్రజాస్వామ్యాన్ని గౌరవం ఇచ్చే పార్టీ టీడీపీ అని అన్నారు. అహంకారంతో ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని నాశనం చేసిన వ్యక్తిని ఇంటికి పంపించాల్సిన సమయం వచ్చిందన్నారు. ఆ బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు.
Gang Rape: జార్ఘండ్ లో అమానుష ఘటన .. విదేశీ టూరిస్ట్ పై గ్యాంగ్ రేప్