టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధోని క్రికెట్లో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా క్రికెట్ నుంచి రిటైర్మెంట్ పొందిన తర్వాత కూడా ఇతనికి ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసినదే. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఎంఎస్ ధోని రాంచిలో ఉన్న తన ఫామ్ హౌస్ లో కడక్ నాథ్ కోళ్ల పెంపకం, సేంద్రియ వ్యవసాయంతో ఎంతో బిజీ అయిపోయారు. అంతేకాకుండా మరొకవైపు వాణిజ్య ప్రకటనల ద్వారా తన అభిమానులకు దగ్గరవుతున్నారు.
ధోని ముద్దుల కూతురు జీవా గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సోషల్ మీడియాలో జీవాకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. జీవ పేరుమీద ఇంస్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. దీని ద్వారా ఎప్పటికప్పుడు తన ఫోటోలను అప్డేట్ చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తుంటారు. ఇద్దరికీ వేరువేరుగా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ధోని, జీవా త్వరలో ఇద్దరూ కలిసి బుల్లి తెరపై ఓ బిస్కెట్ కంపెనీకి సంబంధించిన వాణిజ్య ప్రకటనలో కనిపించి అభిమానులను అలరించనున్నారు.
వీరిద్దరూ కలిసి నటించిన వాణిజ్య ప్రకటన జనవరి నెలాఖరులో బుల్లితెరపై ప్రసారం కానుంది. ఇప్పటికే ధోని పలు వాహనాలకు, దుస్తుల సంబంధించిన కంపెనీలకు ప్రకటన కర్తగా ఎన్నో వాణిజ్య ప్రకటనలో నటించిన ఎంఎస్ ధోని మొదటిసారిగా తన కూతురితో కలిసి బిస్కెట్ వాణిజ్య ప్రకటన చేయబోతున్నారు. ఈ ప్రకటనకు సంబంధించిన ఒక పోస్ట్ ను సంబంధిత కంపెనీ తన ఇన్స్టా ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ధోని తన కూతురు కలిసి నటించిన ఆ ప్రకటన కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.