Nabha Natesh: ఇస్మార్ట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ నభా నటేష్. ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ సినిమాతో బాగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అదుగో సినిమాలో నటించింది. నటన పరంగా నభా నటేష్కి ఈ రెండు సినిమాలు మంచి గుర్తింపును తీసుకు వచ్చాయి. అయితే ఆమె ఆశించిన హిట్ మాత్రం దక్కలేదు. సరిగ్గా ఇదే సమయంలో టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నభా నటేష్కి అవకాశం ఇచ్చాడు. అప్పటి వరకు పూరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడుతుండటంతో ఎవరికీ పెద్దగా నమ్మకాలు లేవు.
అయితే పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ ట్రైలర్, మేకింగ్ సాంగ్స్ రిలీజయ్యాయో అప్పుడు అందరికీ బాగా నమ్మకం కలిగింది. ఎవరూ ఊహించని విధంగా ఇస్మార్ట్ శంకర్ భారీ మాస్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో నభా నటేష్ పోషించిన చాందిని పాత్రకి మంచి పేరు వచ్చింది. దాంతో జనాలలో లాగే ఇండస్ట్రీ వర్గాలలో విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. దాంతో ఈమెకి ఇక టాలీవుడ్లో తిరుగుండదని అందరూ మాట్లాడుకున్నారు. అలాగే ప్రస్తుతం తెలుగులో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్లలో నభా కూడా ఒకరు.
Nabha Natesh: నభా నటేష్ కెరీర్ డైలమాలో పడింది.
నభా నటేష్ ఇస్మార్ట్ శంకర్ మూవీ తర్వాత మాస్ మహారాజ రవితేజ హీరోగా వచ్చిన డిస్కోరాజాలో నటించింది. అయితే ఈ సినిమా ఆశించిన విధంగా విజయాన్ని అందుకోలేకపోయింది. ఆయన కూడా నభాకి వెంటనే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో అవకాశం అందుకుంది. ఈ సినిమాలో తన అందచందాలతో బాగానే ఆకట్టుకుంది. కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. ఇలా రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపయ్యే సరికి నభా కెరీర్ డైలమాలో పడింది. అయితే అనుకోకుండా నితిన్ సినిమాలో అవకాశం అందుకొని షాకిచ్చింది.
బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన సినిమా అంధాదున్. ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో ఆయుష్మాన్ బ్లైండ్ అండ్ పియానో ప్లేయర్గా నటించాడు. హిందీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డులు దక్కించుకుంది. దాంతో నితిన్ ఈ సినిమా రీమేక్ రైట్స్ కొన్నాడు. ఆయనే ఇందులో హీరోగా నటించాడు. మాస్ట్రో ట్రైలర్ తో రూపొందిన ఈ సినిమా ఇటీవల నేరుగా ఓటీటీలో రిలీజైంది.
Nabha Natesh: క్రేజీ ప్రాజెక్ట్లో అవకాశం ఇచ్చి నభా నటేష్ ను ఆదుకునేదెవరో పాపం.
ఓటీటీ ప్రభావమా లేక నితిన్కి కథ సూటవలేదా తెలీదు గానీ మాస్ట్రో జనాలకి అంతగా ఎక్కలేదు. రాధికా ఆప్టే ప్లేస్లో నభా నటేశ్, టబు పాత్రలో ఇక్కడ తమన్నా నటించారు. మేర్లపాక గాంధీ దీనికి దర్శకత్వం వహించాడు. అయితే చెక్, రంగ్ దే సినిమాలతో ఆశించిన విజయాలను అందుకోలేపోయిన నితిన్ మాస్ట్రో మీద చాలా నమ్మకాలు పెట్టుకుంటే ఈ సినిమా కూడా నితిన్కి నిరాశనే మిగిల్చింది. దాంతో నభాకి మాస్ట్రో కలిసి రాలేదు. సరైన హిట్ కోసం ఎదురు చూసిన నభా పరిస్థితి ఇప్పుడు డైలమాలో పడింది. ఇలాంటి సమయంలో క్రేజీ ప్రాజెక్ట్లో అవకాశం ఇచ్చి ఆమెను ఆదుకునేదెవరో పాపం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!