అమరావతి : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై కృష్ణాజిల్లా నందిగామ పోలీస్ స్టేషను లో కేసు నమోదు అయింది. కరోనా వైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో హైదరాబాద్ నుండి విజయవాడ కు రోడ్డు మార్గాన వస్తూ జగ్గయ్యపేట, నందిగామ, కంచికచర్లలో నిబంధనలకు విరుద్ధంగా జనసమీకరణకు కారణమైయ్యారని, కార్యకర్తలు భౌతిక దూరం పాటించలేదని న్యాయవాది శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. దీనిపై188 ఐపిసి సెక్షన్ 3 అఫ్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, ప్రత్యేక అనుమతితో మే 25న ఏపీలో అడుగుపెట్టిన చంద్రబాబు మార్గమధ్యంలో పలు చోట్ల జనసమీకరణ, బైక్ ర్యాలీలతో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించడంపై వైసీపీ వర్గాల నుండి విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ ఆంక్షలు ఉల్లంఘించిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం కూడా దాఖలైంది. వైసీపీ ఎమ్మెల్యే వెన్నపూసల గోపాలరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే విషయంపై ఆరు రాజుల క్రితం ఒ సామాజిక కార్యకర్త ఫిర్యాదు మేరకు తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ లోనూ కేసు నమోదు అయింది.
previous post