నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టు ఆదేశాలతో మరలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా నియమితులైన సంగతి తెలిసిందే. చంద్రబాబు హయాంలో మొట్టమొదటిసారి 2016లో ఎస్ఈసీ గా నియమితుడైన నిమ్మగడ్డ యొక్క పదవి కాలం మరొక పది నెలల్లో పూర్తి అవుతుంది. అయితే ఈ మధ్యనే స్థానిక ఎన్నికలను వాయిదా వేసి అధికార పార్టీలో ఆగ్రహానికి గురైన నిమ్మగడ్డ రమేష్…. ప్రభుత్వం తీసుకొని వచ్చిన కొత్త చట్టంతో ఆ పదవి నుండి తొలగించబడ్డ విషయం కూడా తెలిసిందే. హైకోర్టులో పిటిషన్ వేసుకొని నియమితులైన ఆయన ఇప్పుడు కేవలం పది నెలలు మాత్రమే అతని చేతిలో పవర్ ఉంటుంది కాబట్టి అతను కూడా పంతానికి పోతున్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కొంచెం తొందర ఎక్కువ అని అందరూ అంటుంటారు. అందుకు తగ్గట్లుగానే మొన్న హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే తాను పదవీ బాధ్యతలను స్వీకరించినట్లు ఆయన ప్రకటించడం విడ్డూరం కాగా హైకోర్టు కాపీ చేతికి అందకుండా అనే ఆయన బాధ్యతలు చేపట్టినట్టు ప్రకటించుకోవడం అతని తొందరపాటుతో దానికి నిదర్శనం అని చెప్పాలి. ఇకపోతే నిమ్మగడ్డ గత రెండున్నర నెలల నుండి ఆంధ్రప్రదేశ్ లో లేరు, రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేక తనకు ఏపీలో భద్రత లేదని భావించిన ఆయన తెలంగాణకు వెళ్లిపోయారు.
ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం తో ఆయనకు భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖకు లేఖ రాయగా కేంద్రం కూడా వెంటనే అతనికి భద్రతను కల్పించారు. అయితే అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్ పైన కూడా నమ్మకం లేదు. ఇప్పటికే ఆయన పై ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది. మరీ ముఖ్యంగా నిమ్మగడ్డ హోం శాఖకు భద్రత కొరకు రాసిన లేఖ టిడిపి కార్యాలయంలో తయారైందని సిబిఐ ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఇంకా ఎస్ఈసీ ఇంకా అంగీకరించనేలేదు. తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని మరియు ఆయనను ఎస్ఈసీ ప్త్రస్తుతానికి గుర్తించడం లేదని స్వయంగా అడ్వకేట్ జనరల్ చెప్పడం విశేషం.
ప్రభుత్వంతో అతనికి ఏవైనా పరస్పర విభేదాలు ఉంటే నిమ్మలంగా కూర్చుని పరిష్కరించుకోవాల్సినది పోయి ఇలా తొందరపాటుతనంగా వ్యవహరించి రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాసంగా ఉండాలని వ్యాఖ్యలు చేయడం మరియు వారి పాలనను తప్పుపట్టడం వంటివి చేస్తున్న నిమ్మగడ్డకు రానున్న రోజులు సజావుగా సాగవు అనడంలో ఎటువంటి సందేహం లేదు.