కొత్త పార్లమెంట్ భవనంపై ఏర్పాటు చేసిన జాతీయ (సింహాల) చిహ్నంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. కొత్త చిహ్నంపై కొందరు సామాజిక కార్యకర్తలు, విపక్షాలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. ఎంతో హుందాగా, రాజసంగా ఆత్మవిశ్వాసంతో ఉండే నాలుగు సింహాలు, క్రూరంగా, దౌర్జన్యకరంగా కనిపిస్తున్నాయనీ, తక్షణమే మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. లోక్ సభలో కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి దీనిపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. “మోడీ జీ.. దయచేసి సింహం ముఖాన్ని ఓ సారి చూడండి. సర్నాథ్ నుండి స్పూర్తిపొంది రూపొందించిన ప్రతిమలా ఉందా లేక వక్రీకరించిన గిర్ సింహం పోటోలా ఉందో ఒక సారి పరిశీలించండి. వీలైతే మార్పించండి ” అంటూ ట్వీట్ చేశారు.
అదే విధంగా టీ ఎం సీ పార్లమెంట్ సభ్యుడు జవహర్ సర్కార్ దీనిపై బీజేపీపై మండిపడ్డారు. “జాతీయ చిహ్నాన్ని అవమానించారు. ఎడమ వైపు ఉన్నది ఒరిజినల్ ఫోటో, సింహాలు హుందాగా, రాజసంతో, ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి. కుడి వైపు ఉన్నది మోడీ వెర్షన్ సింహాలు.. ఆగ్రహంతో, క్రూరంగా ఉన్నాయి. ఇది సిగ్గు చేటు, తక్షణమే మార్చండి” అంటూ డిమాండ్ చేశారు. జాతీయ చిహ్నంలో మర్పులను సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భుషణ్ తప్పుబట్టారు. “మోదీ నవ భారత్ ఇదే అంటూ వ్యంగ్యంగా విమర్శించారు. మరో టీఎంసీ ఎంపి మోహువా మొయిత్రా .. రెండు చిహ్నాల ఫోటోలను పక్కపక్కనే ఉంచి ఆ రెండు చిత్రాల మధ్య తేడాలను చూపేలా ట్వీట్ చేశారు. ఆర్ జేడీ సైతం తాాజా చిహ్నాలపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది. ఈ అంశంపై జాతీయ స్థాయి టీవీ ఛానల్స్ డిబేట్ లు జరుగుతున్నాయి. మెజార్టీ వర్గాలు ఈ చిహ్నాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై ప్రధాన మంత్రి మోడీ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
భార్యతో సహా దేశం విడిచి పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స