దశాబ్దకాలంగా తెలుగు రాజకీయాలను చూస్తున్న వారికి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పై ఒక అవగాహన ఉంటుంది. అతని మాట తీరు, ప్రవర్తన ఎలాంటిదో అందరికీ తెలుసు. అతనిని అభిమానించే వారు ఉన్నారు… విమర్శించే వారు ఉన్నారు. అయితే సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఆయన ధోరణి మూసపోసినట్లు గా ఒకేలాగా ఉండటం మనం గమనించవచ్చు. ఇక ఆయన మాటలు పక్కాగా ప్రాక్టికల్ గా ఉంటాయి. ఇతర నాయకుల్లాగా భావోద్వేగం కానీ ఎమోషన్ లు కానీ ఆయన బయటకు చూపించింది చాలా అరుదు. అయితే ఎప్పుడో ఒకసారి తప్ప అతని నోటివెంట ఇంతటి ఎమోషనల్ మాటలు వినిపించలేదు.
అలాంటి చంద్రబాబు తొలిసారి భిన్నమైన తరహాలో స్పందించారు. ఏపీ రాజధాని అమరావతి ని కాదని మూడు రాజధానులు కాన్సెప్టు ని జగన్ సర్కారు తీసుకోవడం…. తర్వాత ఎన్నో వాదోపవాదాల తర్వాత తాజాగా దానికి ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలో చంద్రబాబు ఎమోషనల్ గా బరస్ట్ అయ్యారు. తను అనుభవించడానికి అమరావతిని రాజధానిగా కట్టలేదని… ఆయన ప్రజల శ్రేయస్సు కోసమే తాను పాటుపడ్డడని వాపోయాడు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసి… 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్న తనకు అంతకుమించి ఏం కావాలన్నారు.
అన్నింటికీ మించి చంద్రబాబు ఆరోగ్యం బాగా ఉంటే తను మరో పదేళ్లు ఎక్కువగా బ్రతికి ఉంటానని… అమరావతి తన కోసమే కాదని…. ఈ విషయాన్ని ఏదో ఒక రోజు అందరూ తెలుసుకుంటారని అన్నారు. ఇప్పటివరకు చంద్రబాబు తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్న విషయంపై ప్రస్తావించింది లేదు. అన్నింటికీ మించి మరణం గురించి ఆయన మాటల్లో కి ఏనాడూ వినిపించదు. అలాంటి ఆయన ఎమోషనల్ అవ్వడం అతని శత్రువులకి కూడా కొంచెం బాధ అనిపించి విషయమే.
అయితే ఉన్నట్టుండి చంద్రబాబు ఇలా అతని మరణం గురించి మరియు అమరావతి గురించి ఇంతలా బాధ పడడానికి కారణం తన తర్వాత టిడిపిని సమర్థవంతంగా నిర్వహించగల ప్రత్యామ్నాయం అతనికి కనిపించకపోవడం అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. లోకేష్ ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉండగా… అసలు జగన్ దూకుడు కి అంత అనుభవం ఉన్న చంద్రబాబునే తట్టుకోలేకుంటే రేపు లోకేష్ ఎలా ఈ పార్టీని నడిపిస్తాడు అన్న భయం ఇప్పుడే బాబుకు పట్టుకుంటుంది. అమరావతి విషయంలో జగన్ నెగ్గిన తీరు చూసిచంద్రబాబుకి అతని రాజకీయ భవిష్యత్తుపై, పార్టీ రాజకీయ భవిష్యత్తుపై బెంగ పట్టుకున్నట్లు అనిపిస్తోందని పలువురు చెబుతున్నారు.