శంషాబాద్ ఎయిర్ పోర్టు దగ్గర ఉన్న మోహన్ బాబు నివాసం లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తాజాగా బయటకు వచ్చిన రిపోర్టు ప్రకారం కొద్దిమంది గుర్తుతెలియని వ్యక్తులు శంషాబాద్ లోని మోహన్ బాబు ఇంటికి ఒక టొయోటో ఇన్నోవా కారు లో వెళ్లి అతనికి తీవ్రమైన వార్నింగ్ ను జారీ చేశారు. బయటకు వచ్చిన సమాచారం ప్రకారం ఒక నలుగురు వ్యక్తులు అనుమతి లేకుండా లోనికి ప్రవేశించి సెక్యూరిటీ వారిని వాళ్ళని నెట్టుకుంటూ శంషాబాద్ లోని జల్లపల్లి లో ఉన్న మోహన్ బాబు నివాసంలో లోనికి ప్రవేశించారు.
ఆ తర్వాత వాచ్ మ్యాన్ అలెర్ట్ గా లేకపోవడంతో వారు నేరుగా మోహన్ బాబు ఇంట్లోకి వెళ్ళారు. వారు ఖచ్చితంగా మోహన్ బాబు ని ఏమి మాటలు అన్నారో తెలియదు కానీ. తన పద్ధతి మార్చుకోకుంటే భవిష్యత్తు లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అతనిని బెదిరించడం గమనార్హం. ఇక ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇలా లోనికి వచ్చి మోహన్ బాబు కి ఘాటయిన వార్నింగ్ ఇవ్వడంతో అతని ఇంటి చుట్టూ తీవ్రమైన టెన్షన్ నెలకొంది.
వెంటనే మోహన్ బాబు తన కుటుంబంతో కలిసి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు. ఇక పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు.ఇదిలా ఉండగా పోలీసులు నలుగురు వ్యక్తులు ఎవరో ఇప్పటికీ కనుక్కోలేదు. అసలు మోహన్ బాబు లాంటి వ్యక్తి యొక్క ఇంటికి ఎంత ధైర్యంగా కార్లో ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చే వారు ఎవరు వాళ్ళు ఉంటారు అని తల బద్దలు కొట్టుకుంటున్నారు.
ఇంతకు తెగించారంటే దీని వెనుక రాజకీయ హస్తం ఏమైనా ఉందా అన్నది ఇక్కడి ప్రశ్న. నటుడు, విద్యావంతుడు మరియు రాజకీయ నాయకుడు అయిన మోహన్ బాబు కి ఇటువంటి బెదిరింపు వారిని రావడం నిజంగా అటు రాజకీయ వర్గాల్లో మరియు ఇండస్ట్రీ వర్గాల్లో కలకలం రేపింది అనే చెప్పాలి. అసలు ఇది వాళ్ళు ఆకతాయితనంగా లేదా పాపులర్ అయ్యేందుకు వచ్చి వార్నింగ్ ఇచ్చారా లేకపోతే నిజంగానే సీరియస్ గా బెదిరించారా అన్న విషయం ఇంకా తేలాల్సి ఉంది.