టాలీవుడ్ లో అలనాటి మేటినటి మహానటి సావిత్రి తర్వాత మళ్ళీ అంతటి గొప్ప పేరు తెచ్చుకుంది సౌందర్య. సౌందర్య లాంటి హీరోయిన్ ఇక మళ్ళీ ఇండస్ట్రీకి దొరకడం కష్టమే అన్న కామెంట్స్ తన మరణం తర్వాత చాలానే వినిపించాయి. తెలుగు. తమిళం, కన్నడ, హిందీ భాషల్లో సూపర్ స్టార్స్ నటించి నంబర్ వన్ స్థానాన్ని చేరుకుంది సౌందర్య. అయితే సినిమా షూటింగ్ ముగించుకొని తిరిగి వస్తుండగా అనూహ్యంగా జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణిచింది.
కాగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నాగ్ అశ్విన్ మహానటి సావిత్రి జీవిత కథని వెండితెర మీద ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. మహానటి పేరుతో సావిత్రి సినిమా, జీవిత విశేషాలను అద్భుతంగా తెరమీద చూపించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ సినిమాలో నటించిన కీర్తి సురేష్ కి గొప్ప పేరు దక్కించుకుంది. చెప్పాలంటే మహానటి కి ముందు మహానటి కి తర్వాత అన్నట్టుగా కీర్తి సురేష్ గురించి చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ కోసం ప్రత్యేకంగా కథలు తయారవుతున్న సంగతి తెలిసిందే.
కాగా గత కొన్నాళ్ళుగా సౌందర్య బయోపిక్ ని తెరకెక్కించాలని కొంతమంది మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో త్వరలో ఈ బయోపిక్ ని అధికారకంగా వెల్లడించనున్నారని తెలుస్తుంది. అయితే సౌందర్యగా సాయి పల్లవి నటించే అవకాశాలున్నాయని సమాచారం. సౌందర్య లోని అన్ని ఎమోషన్స్ ని స్క్రీన్ మీద సాయి పల్లవి అయితే సరిగ్గా మాచ్ చేయగలదన్న ఉద్దేశ్యంతో మేకర్స్ సాయి పల్లవి తో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతో తెలియదు గాని ఫ్యాన్స్ మాత్రం సౌందర్య గా సాయి పల్లవి అంటే తప్పకుండా పాత్ర కి జీవం పోస్తుందని సాయి పల్లవి పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పుకుంటున్నారట.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!