సాధారణంగా మనకు జలుబు చేయగానే కరోనా అని చాలామంది భయపడుతూ ఉంటారు. కరోనా వ్యాధి సోకితే దాని ప్రభావం, లక్షణాలు ఏ విధంగా ఉంటాయో కొంతమందిలో సరైన అవగాహన లేక ఇలాంటి భయాలకు గురవుతూ ఉంటారు. జలుబు చేసినంత మాత్రాన అది కరోనా అని భయపడాల్సిన పనిలేదు. అది కేవలం మన భయం లేదా అపోహ మాత్రమే. జలుబు అనేది కేవలం కరోనా ఒక లక్షణం మాత్రమే, కానీ జలుబు వచ్చినంత మాత్రాన కరోనా వస్తుందని ఏ అధ్యయనంలో రుజువు కాలేదు. అయితే రోజూ కరోనా గురించిఒక కొత్త విషయం బయటపడుతూవస్తోంది. అయితే కరోనా.. జలుబు ఈ రెండు వేరు వేరు వ్యాధులే. అయితే ఈ రెండింటి మధ్య తేడా ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
సాధారణంగా కరోనా వైరస్ గాలిలోని తేమ ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది అన్న విషయం మనకు తెలిసినదే.తేమఎక్కువగా ఉండే వాతావరణం లాలాజలంలో ఉండే వైరస్ జీవితకాలాన్ని మరింత పెంచుతాయని ఓ పరిశోధనలో తేలింది. కరోనావైరస్ గాలిలోని తేమ ద్వారా వ్యాప్తి చెందుతుంది అంతేకాకుండా దగ్గినప్పుడు తుమ్మినప్పుడు లాలాజల బిందువుల ద్వారా దాదాపు 70 శాతం వైరస్ లు కింద పడి నశించిపోతాయి. కాబట్టి వీలైనంత వరకు సామాజిక దూరం పాటించడం ఎంతో ముఖ్యం. సాధారణంగా మనకు జలుబు చేసినప్పుడు మన ముక్కులో శ్లేష్మం ఏర్పడి ముక్కులు బ్లాక్ అవుతాయి. అందువల్ల మనము ఎటువంటి వాసనను గుర్తించలేము. కానీ కరోనా సోకిన వారు కూడా వాసనను గుర్తించలేరు, కానీ వీరిలో ముక్కు బ్లాక్ కావని ఈస్ట్ ఆంగ్లియ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తెలిపారు.
కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే, సామాజిక దూరం పాటించాలి. మాస్కులు ధరించడం వల్ల కరోనా ను కొద్దివరకు నియంత్రించవచ్చు. అయితే ఎటువంటి వస్త్రాలు ధరించడం వల్ల కరోనా నుంచి మనల్ని రక్షిస్తుంది అన్న అనుమానం కలుగుతుంది. క్లాత్ మాస్క్ ధరించడం వల్ల,కరోనా నుంచి విముక్తి పొందవచ్చు అని ఇల్లినాయిస్ యూనివర్సిటీ కి చెందిన పరిశోధకులు సాధారణంగా ఇంట్లో దొరికే 11 రకాల వస్త్రాలను పై అధ్యయనం చేశారు. అయితే ఈ విషయంలో మరింత పరిశోధన జరగాల్సి ఉందని పరిశోధకులు తెలిపారు.