ఒకానొక దశలో రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ విపరీతమైన బిజీగా ఉండేది. టాలీవుడ్ లో హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ కూడా అందుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకి డేట్స్ కూడా అడ్జెస్ట్ చేయలేనంత బిజీగా ఉండే రకుల్ ఆ సమయంలో ఇంకే భాషలో సినిమా చేయాలన్నా ఆలోచన కూడా లేకుండా తెలుగు సినిమాలు చేసింది. కాని ఒక్కసారిగా టాలీవుడ్ లో రకుల్ నటించిన సినిమాలు ఫ్లాప్ కావడంతో కాస్త గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో బాలీవుడ్ లో అజయ్ దేవగన్ టబు లతో నటించిన దేదే ప్యార్ దే బంపర్ హిట్ అందుకుంది.
అంతేకాదు మళ్ళీ టాలీవుడ్ లో రకుల్ కి ఊహించని విధంగా సినిమా అవకాశాలు వచ్చాయి. మన్మధుడు 2 తర్వాత కాస్త గ్యాప్ వచ్చిన రకుల్ కి మళ్ళీ తెలుగులో క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరో నటిస్తున్న సినిమాలో ఛాన్స్ దక్కింది. ఈ ఒక్క సినిమా తో ఎలాగైనా హిట్ కొట్టి మళ్ళీ ఫాం లోకి రావాలనుకున్న రకుల్ కి అనూహ్యంగా యంగ్ హీరో నితిన్ – చంద్ర శేఖర్ ఏలేటి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాలో కూడా నటించే అవకాశం అందుకుంది. ఈ రెండు సినిమాలు 2021 లో రిలీజ్ కాబోతుండగా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతాయన్న నమ్మకంగా ఉంది.
కాగా ఇంతలోనే రకుల్ కి మళ్ళీ బాలీవుడ్ నుంచి మరో బంపర్ ఆఫర్ దక్కించుకుంది. ఇంతకు ముందు నటించిన అజయ్ దేవగన్ కి జంటగా రకుల్ ప్రీత్ సింగ్ నటించబోతోందట. అజయ్ దేవగన్ నటిస్తూ నిర్మిస్తున్న ‘మే డే’ సినిమాలో రకుల్ ని హీరోయిన్ గా ఎంచుకున్నారు. కాగా ఈ సినిమాకు అజయ్ దర్శకత్వం వహించబోతుండటం విశేషం. ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. దేదే ప్యార్ దే హిందీలో మంచి కమర్షియల్ సక్సస్ ని సొంతం చేసుకుంది. అండ అజయ్ దేవగన్ – రకుల్ జంట కూడా అందరిని బాగా ఆకట్టుకుంది. అందుకే మరోసారి బాలీవుడ్ సాలీడ్ మూవీ చేయబోతోంది. ప్రస్తుతం రకుల్ కమిటయిన సినిమాలు గనక సూపర్ హిట్ గా నిలిస్తే ఇక రకుల్ ని ఆపే సత్తా ఎవరికీ లేనట్టే అంటున్నారు.