ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. రాం చరణ్ మరో హీరోగా నటిస్తున్న ఈ భారీ మల్టీస్టార సమ్మర్ కి రిలీజ్ చేసేందుకు రాజమౌళి శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నాడు. ఎన్టీఆర్, రాం చరణ్ ఎలాగైనా మార్చ్ వరకు ఆర్ ఆర్ ఆర్ నుంచి బయటపడాలని చూస్తున్నారని సమాచారం. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అధికారక ప్రకటన కూడా వచ్చేసింది.
అయితే వాస్తవంగా ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కాల్సి ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించనున్నారని వార్తలు వచ్చాయి. వాస్తవంగా ‘కేజీఎఫ్’ 2 తర్వాత ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబోనే అనౌన్స్ అవుతుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో పాన్ ఇండియా సినిమా సలార్ ని అనౌన్స్ చేసి భారీ షాకిచ్చాడు. ఈ పాన్ ఇండియా సినిమా ని హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరంగందూర్ నిర్మిస్తున్నారని వెల్లడిస్తూ ప్రభాస్ ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు.
అంతేకాదు ఈ సినిమాని 2021 జనవరిలో సెట్స్ పైకి తీసుకెళ్లి అదే ఏడాది విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లేదని అందరూ డిసైడయి పోయారు. అయితే లేటెస్ట్ అప్డేట్ తో త్వరలో ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తారని సమాచారం. సలార్ ని అనౌన్స్ చేసినట్టే ఎవరూ ఊహించని విధంగా ప్రాజెక్ట్ ని సర్ప్రైజింగ్ గా అనౌన్స్ చేస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. మరి ఆ సర్ప్రైజింగ్ డేట్ ఎప్పుడన్నది తెలియక పోవడం తో ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారట.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!