ఎప్పటినుండో ప్రపంచం అంతమైపోతుందని రకరకాల వార్తలు వినపడుతూనే ఉన్నాయి. కానీ ఎన్ని సంవత్సరాలు ఇలాంటి వార్తలు వచ్చినా అవి వార్తలు గానే మిగిలిపోయాయి. కాగా ఈ ఏడాది సంబంధించిన మహమ్మారి కరోనా వైరస్ మాత్రం చాలా మంది ప్రజలు మరియు దేశాలు, ప్రభుత్వాలు తీవ్రస్థాయిలో నష్ట పోయాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అప్పట్లో గ్రెగోరియన్ క్యాలెండర్ వాడిన టైంలో ప్రపంచంలో అనేక వాదోపవాదాలు జరగటంతో బ్రిటిష్ హయాంలో ఆ క్యాలెండర్ ను అధికారికంగా వాడాలని ఆదేశాలు ప్రపంచవ్యాప్తంగా జారీ చేయడం జరిగింది. ఈ పరిణామంతో సెప్టెంబరు 3 నుండి 14గా మారింది.
ఈ పరిణామం తో బ్రిటీష్ హిస్టరీలో ఆ 11రోజులు మాయం అయిపోయాయి. ఇలా ఈ వింత చర్యల వల్ల పుట్టుకొచ్చిందే కుట్ర సిద్దాంతం.. ఇప్పుడు ఈ సిద్దాంత కర్తలే ప్రజలను భయానికి గురిచేస్తున్నారు. దీంతో అప్పట్లో 2012 డిసెంబర్ 21 వ తారీఖున ప్రపంచం అంతమైపోతోందని కొంతమంది కుట్ర సిద్ధాంతకర్తలు వార్తలను వైరల్ చేశారు. తీరా చూస్తే అది ఏమీ జరగలేదు. 2012 వెళ్ళిపోయి ప్రస్తుతం 2020లో మంచి స్పీడ్ మీద కరోనా తో ప్రపంచం బ్రేక్ వేసి ఉంది. ఇదిలా ఉండగా తాజాగా ఇదే రీతిలో ఈనెల జూన్ 21న ప్రపంచం మళ్లీ అంతమైపోతుందని ఒక వార్త ఇప్పుడు సిద్దాంత కర్తలే వైరల్ చేస్తున్నారు. ఈ వార్త వైరల్ కావడంతో సోషల్ మీడియాలో సెన్సేషనల్ న్యూస్ గా మారింది. దీంతో ఈ వార్త విని చాలామంది ప్రజలు కరోనా వైరస్ తో భయపడిపోతున్న ప్రజలు మరి ఇంకా భయపడిపోతున్నారు. కాగా ఇలాంటి గాలి వార్తలు సినిమాలు తీయడానికి పనికొస్తాయి గానీ, నమ్మడానికి పనికిరావని మరోపక్క వార్తలు చదివిన కొంతమంది నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.