ఇప్పటివరకు ఆరంజ్ మన ఆరోగ్యానికి మంచిదని తెలుసు. ఆరంజ్ జ్యూస్ చేసుకుని తాగడం వల్ల ఎన్నో అద్భుత ప్రయోజనాలున్నాయని కూడా మనకు తెలుసు. కానీ, ఇది తాగడం వల్ల పక్షవాతం వచ్చే ముప్పు ఉండదని నిపుణులు తెలియచేస్తున్నారు. నెదర్లాండ్ యూనివర్సిటీ కి చెందిన పరిశోధకులు చేసిన పరిశోదన లో ఈ విషయం బయటపడింది. ఈ జ్యూస్ తాగడం వల్ల మెదడు లో రక్తం గడ్డ కట్టే సమస్యలు తగ్గుతాయని ఈ కారణం గా పక్షవాతం ముప్పు 25 శాతంతగ్గినట్టేనని తేల్చి చెప్పారు.
20 ఏళ్ల వయ్యస్సు నుండి 70 సంవత్సరాల వయసు గల 35 వేల మందిపై సుదీర్ఘకాలం అధ్యయనం చేసారు. ఇందులో భాగంగా, కొంత మందికి మాములు పళ్ళరసాలు ఇచ్చారు. మరికొంత మందికి కేవలం ఆరంజ్ జ్యూస్ మాత్రమే ఇవ్వబడింది. వీరిని పరిక్షించిన శాస్త్రవేత్త లు.. ఆరంజ్ జ్యూస్ తాగిన వారిలో పక్షవాత ముప్పు తగ్గిందని కనుగొన్నారు .
అంతే కాదు ఆరంజ్ జ్యూస్ తాగడంవల్ల శృంగార సామర్థ్యం కూడా పెరుగుతుందని నిపుణులు తెలియచేస్తున్నారు. ఆరెంజ్ లో ఉండే విటమిన్ సి శిశువు ఎదుగుదలకుసహాయపడుతుంది . శిశువు రోగ నిరోధక శక్తి ని కూడా పెరిగేలా చేస్తుంది. ఇలా జరగడం వలన బిడ్డ పుట్టాక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు ఆరెంజ్ జ్యూస్ కచ్చితం గా తాగాలి .
ఆరెంజ్ జ్యూస్లో ఉండే విటమిన్ సి వల్ల శరీరం ఐరన్ను బాగా గ్రహిస్తుంది. దీంతో తల్లి బిడ్డ ఇద్దరికీ రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు నిత్యం ఆరెంజ్ జ్యూస్ తాగాలి. ఈ చలి కాలం లో ప్రతి రోజూ ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం వలన ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు అంటున్నారు. ఆరెంజ్ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం గా ఉండడం వలన రక్తం లో చెడు కొలస్ట్రాల్ తగ్గి అధిక బరువు సమస్య కూడా ఉండదు.