కరోనా కారణంగా దేశంలో అనేక కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే సౌకర్యాన్ని కల్పిస్తున్న విషయం విదితమే. కాగా దేశంలోని టాప్ 5 ఐటీ కంపెనీల్లో ప్రస్తుతం 95 శాతం వరకు ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఈ మేరకు ఆయా కంపెనీలు తాజాగా వివరాలను వెల్లడించాయి.
భారత్లోని టాప్ 5 ఐటీ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్, విప్రో, టెక్ మహీంద్రాలకు చెందిన మొత్తం 11.38 లక్షల మంది ఉద్యోగుల్లో 10.81 లక్షల మంది (దాదాపుగా 95 శాతం మంది) ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు. ఇక దేశంలోనే అత్యంత పెద్దదైన సాఫ్ట్వేర్ కంపెనీ టీసీఎస్లో మొత్తం 4.43 లక్షల మంది ఉద్యోగులు ఉండగా.. వారిలో కేవలం 4వేల మంది మాత్రమే ఆఫీసుల్లో పనిచేస్తున్నారు. మిగిలిన అందరూ ఇళ్ల నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు.
ఇప్పటికే టీసీఎస్ కంపెనీ వర్క్ ఫ్రం హోంను తప్పనిసరి చేయాలని భావిస్తోంది. అందులో భాగంగానే 2025 వరకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ కంపెనీ కార్యాలయాల్లో కేవలం 25 శాతం ఉద్యోగులు మాత్రమే పనిచేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో 2025 వరకు టీసీఎస్లో 75 శాతం మంది ఉద్యోగులు ఇళ్ల నుంచే పని చేస్తారన్నమాట. ఇక ఇతర కంపెనీల్లోనూ 95 నుంచి 96 శాతం వరకు ఉద్యోగులు ప్రస్తుతం ఇళ్ల నుంచే పని చేస్తున్నారు.
డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డాట్) వర్క్ ఫ్రం హోంకు గాను డిసెంబర్ 31, 2020 వరకు ఆంక్షలను సడలిస్తూ గత వారం కింద ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దేశంలోని ఐటీ కంపెనీలకు ఎంతో ఊరట లభించింది. గతంలో జూలై 31వ తేదీ వరకే ఆంక్షల సడలింపు ఉండేది. కానీ దాన్ని డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించారు. అయినప్పటికీ ఎక్కువ శాతం కంపెనీ వర్క్ ఫ్రం హోంకే ప్రాధాన్యతను ఇస్తున్నాయి.