Payal Rajput : టాలీవుడ్ లో అగ్ర కథానాయికగా మారుతుందని అందరూ అనుకున్న హీరోయిన్ పాయల్ రాజ్పుత్. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఎక్స్ 100 భారీ హిట్ సాధించింది. ఊహించని సక్సెస్ అందుకున్న ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది పాయల్. అయితే డెబ్యూ సినిమాతో వచ్చిన క్రేజ్ అండ్ పాపులారిటీ ఆ తర్వాత నటించిన సినిమాలకు రాలేదు. ఆర్ డి ఎక్స్ లవ్ అనే సినిమా చేసినా అది ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దాంతో మొదటి సినిమాతో వచ్చిన క్రేజ్ మొత్తం పోయింది. అప్పుడే సీత సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. ఇది కూడా అమ్మడికి ఏమాత్రం ఉపయోగపడలేదు. అక్కడ కూడా పెద్దగా ప్రశంసలు దక్కలేదు.
ఆ తర్వాత కూడా విక్టరీ వెంకటేశ్ – నాగ చైతన్య నటించిన మల్టీస్టారర్ వెంకీమామ సినిమాలో నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ పాయల్కి ఉపయోగపడలేదు. రవితేజతో చేసిన డిస్కోరాజా తో మైనస్ అయింది తప్ప ప్లస్ అయింది ఏమీ లేదు. దాంతో పాయల్ అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ మధ్య ఓ ఓటీటీ సినిమా చేసింది. దీనికి మంచి పేరొచ్చింది. ప్రస్తుతం పంజాబీ సినిమాలలో అవకాశాలు వస్తే ఆ సినిమాలతో బిజీ కాబోతుంది. అయితే అనూహ్యంగా ఈ బ్యూటీకి టాలీవుడ్ లో మరో సినిమా అవకాశం వచ్చింది.
Payal Rajput : పాయల్ రాజ్పుత్ ‘కిరాతక’ తో టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా మారనుందా
ఇలాంటి సమయంలో పాయల్ కి ఈ అవకాశం అంటే మరోసారి తన లక్ చెక్ చేసుకునే టైమ్ వచ్చిందని అందరూ భావిస్తున్నారు. రీసెంట్ గా శశి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆదిసాయి కుమార్ తాజాగా మరో కొత్త సినిమాను ప్రకటించాడు. ‘కిరాతక’ అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇందులో హీరోయిన్ గా పాయల్ రాజ్పుత్ని ఎంచుకున్నారు చిత్ర బృందం.
పూలరంగడు, చుట్టాలబ్బాయి సినిమాలతో పేరు తెచ్చుకున వీరభద్రం ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. విజన్ సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమాను నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నాడు.కాగా క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో ఉండబోతుందని దర్శకుడు వీరభద్రం వెల్లడించాడు. మరి ఈ సినిమాతోనైనా పాయల్ రాజ్పుత్ మంచి హిట్ అందుకొని టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా మారనుందా చూడాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!