ఏ దర్శకుడికైనా వరసగా బ్లాక్ బస్టర్స్… ఇండస్ట్రీ రికార్డ్స్ ఇవ్వడం చాలా కష్టం. గట్టిగా రెండు హిట్స్ ఇస్తే ..ఆ తర్వాత మూడో సినిమా ఫ్లాప్ ఇచ్చిన దర్శకులు చాలామంది టాలీవుడ్ లో ఉన్నారు. అయితే టాలీవుడ్ లో ఫ్లాప్ అంటూ ఎరగని దర్శకుడిగా బాహుబలి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ సత్తా ఏంటో ప్రపంచ దేశాలకి చాటి చెప్పిన దర్శక ధీరుడిగా ఎస్ ఎస్ రాజమౌళి గొప్ప పేరును సంపాదించుకున్నారు.
ఆ తర్వాత వరసగా స్టార్స్ తో సినిమాలు తీసి సక్సస్ లు ఇచ్చిన దర్శకుడిగా మంచి ట్రాక్ రికార్డ్ సాధించాడు కొరటాల శివ. ఇండస్ట్రీలో సక్సస్ ఫుల్ రైటర్ గా స్టార్ హీరోల సినిమాలకి పని చేసి దర్శకుడు కాకముందే టాలీవుడ్ లో మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. కొరటాల ప్రభాస్ తో తీసిన మిర్చి సినిమాతో డైరెక్టర్ గా మారి ప్రభాస్ కి మాస్ ఇమేజ్ ని తెచ్చి పెట్టాడు.
ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో శ్రీమంతుడు, భరత్ అనే నేను, ఎన్.టి.ఆర్ తో జనతా గ్యారేజ్ తీసి వరసగా బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఈ సక్సస్ ట్రాక్ తో మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేసే అవకాశం అందుకున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ తో ఆచార్య తెరకెక్కిస్తున్నాడు. మ్యాట్నీ ఎంటర్టైన్మైంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై మెగా పవర్ స్టార్ రాం చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఒక పాన్ ఇండియన్ సినిమా చేయనున్నాడు కొరటాల శివ. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించి అధికారక ప్రకటన కూడా వెలువడింది. ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా తర్వాత కూడా కొరటాల మరో మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, లైన్ లో పెట్టుకున్నట్టు తెలుస్తుంది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, రాం చరణ్..సూపర్ స్టార్ మహేష్ బాబు లతో ఈ సినిమాలుండబోతున్నాయని తెలుస్తుంది. మొత్తానికి ఇలా వరసగా భారీ సినిమాలను స్టార్ హీరోలతో తెరకెక్కించే అవకాశం ఒక్క కొరటాలకే దక్కుతుండటం ఎవరూ ఊహించనిది. అయితే ఇలాగే సక్సస్ ట్రాక్ ఎంతకాలం మేయిన్టైన్ చేయగలడో అని అంటున్నారు. ఇది ఆయనకి వరమే అని కొంతమంది చెప్పుకుంటున్నారట.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!