ప్రధాని మోదీ తన ఆరోగ్యం పట్ల ఎంతగానో శ్రద్ధ చూపిస్తారన్న విషయం విదితమే. వేకువ ఝామునే ఆయన నిద్రలేచి యోగా, ధ్యానం, వాకింగ్ వంటి వ్యాయామాలు చేస్తారు. అందులో భాగంగా ఆయన ఆదివారం ఉదయం తన నివాసంలోని నెమళ్లకు ఆహారం తినిపిస్తూ కనిపించారు. ఆ వీడియోలను ఆయన స్వయంగా తన ఇన్స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేశారు.
నెమళ్లకు ప్రధాని మోదీ ఆహారం తినిపిస్తున్న వీడియోకు ఇప్పటికే అనేక వ్యూస్ వచ్చాయి. చాలా మంది లైక్ చేశారు. మోదీ ఇన్స్టా ఖాతాకు 47.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా.. ఇప్పటి వరకు ఆయన అందులో 407 ఫోటోలను పోస్ట్ చేశారు. ఇన్స్టాలో ఆయన ఇతరులెవరినీ ఫాలో అవడం లేదు.
https://www.instagram.com/tv/CEONMDnpjAo/?utm_source=ig_embed
కాగా మోదీ తాను పోస్ట్ చేసిన వీడియో కింద ఓ పద్యాన్ని కూడా రాయడం విశేషం. ఆ పోస్ట్ను ఇప్పుడు అనేక మంది షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా కూడా మారింది. దేశంలోని ప్రజలతో మోదీ ఇప్పటికే పలు సామాజిక మాధ్యమాల్లో నిత్యం టచ్లో ఉంటున్నారు. ఎప్పటికప్పుడు ఆయన తాను చేసే పనులకు చెందిన వివరాలను పోస్టు చేస్తుంటారు. అందులో భాగంగానే ఆయన తాజాగా ఈ వీడియో పోస్ట్ చేశారు.