భారత ప్రధాని నరేంద్ర మోదీ మరో రికార్డు సాధించారు. సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన కాంగ్రెస్యేతర ప్రధానిగా ఆయన రికార్డు నెలకొల్పారు. గతంలో బీజేపీ తరఫున అటల్ బిహారీ వాజ్పేయి 2,268 రోజులు భారత ప్రధానిగా పనిచేయగా.. ఇప్పుడు మోదీ ప్రధానిగా 6 సంవత్సరాలను పూర్తి చేసుకుని వాజ్పేయి రికార్డును బద్దలు కొట్టారు.
ఇక మొత్తంగా చూసుకుంటే భారత దేశాన్ని అత్యంత సుదీర్ఘంగా పరిపాలించిన ప్రధానుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులే ఎక్కువగా ఉన్నారు. జవహర్ లాల్ నెహ్రూ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు. ఆయన దేశాన్ని 16 ఏళ్ల 286 రోజుల పాటు ప్రధానిగా పాలించారు. తరువాత ఆయన కుమార్తె ఇందిరాగాంధీ రెండో స్థానంలో నిలిచారు. ఆమె ప్రధానిగా 11 ఏళ్ల 59 రోజుల పాటు పనిచేశారు. తరువాత 3వ స్థానంలో మన్మోహన్ సింగ్ ఉన్నారు. ఆయన 10 ఏళ్ల 4 రోజుల పాటు పీఎంగా పనిచేశారు.
కాగా ఆగస్టు 5న మోదీ కొత్తగా 3 రికార్డులు సాధించారు. రామ జన్మభూమిని సందర్శించిన మొదటి ప్రధానిగా, అక్కడి హనుమాన్ గఢీలో పూజలు చేసిన మొదటి పీఎంగా, రామమందిర భూమి పూజ చేసిన మొదటి పీఎంగా ఆయన రికార్డులు నెలకొల్పారు. గతేడాది సెప్టెంబర్ వరకు ట్విట్టర్లో ఆయన్ను అనుసరించే వారి సంఖ్య 50 మిలియన్లకు చేరుకుంది. దీంతో దేశంలో ట్విట్టర్లో అత్యధిక ఎక్కువ ఫాలోవర్లు కలిగిన వ్యక్తిగా మోదీ రికార్డు నెలకొల్పారు. ప్రస్తుతం ఆయన సొంత ట్విట్టర్ అకౌంట్కు 60.9 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. పీఎంవో ట్విట్టర్ హ్యాండిల్ ను 37.9 మిలియన్ల మంది ఫాలోవర్లు అనుసరిస్తున్నారు.