PM Modi: విద్యార్ధులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక సూచన చేశారు. ఢిల్లీలోని తాలక్ టోరా స్టేడియంలో నిర్వహించిన అయిదవ విడత పరీక్షా పే చర్చ కార్యక్రమంలో మోడీ విద్యార్ధులతో మాట్లాడారు. కరోనా కారణంగా సుదీర్ఘకాలం తర్వాత నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో విద్యార్దులను కలుసుకోవడం తనకు ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు మోడీ. పరీక్షల వేళ విద్యార్ధులు వాట్సాప్, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని కీలక సూచన చేశారు. చదువులపైనే దృష్టి పెట్టాలన్నారు. పరీక్షల సమయంలో ఒత్తిడిని జయంచడానికి టెక్నిక్స్ ను వివరించారు మోడీ. పరీక్షల సమయంలో ఆందోళనకు గురి కాకుండా ఉండాలన్నారు.
PM Modi: పరీక్షలను ఒక పండుగగా జరుపుకోవాలి
పరీక్షలను ఒక పండుగగా జరుపుకోవాలని మోడీ సూచించారు. విద్యార్ధులు, ఉపాధ్యాయులు, నిపుణుల సూచనలను సలహాలు తీసుకుని దాదాపు 6-7 సంవత్సరాల పాటు శోధించి జాతీయ విద్యా విధానం ముసాయిను తీసుకురావడం జరిగిందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు విద్యార్ధులు కృషి చేయాలని కోరారు. సమయాభావం వలల్ విద్యార్ధుల ప్రశ్నలన్నింటికీ ఈ వేదికపై సమాధానాలు ఇవ్వలేకపోతున్నానని అన్నారు. వీడియో, ఆడియో, సందేశాలు టెక్ట్స్ రూపంలో నమో యాప్ ద్వారా అందిస్తున్నానని చెప్పారు. తొలుత విద్యార్ధులు రూపొందించిన కళాకంఢాల ప్రదర్శనను మోడీ తిలకించారు. విద్యార్ధుల సృజనాత్మకతను మెచ్చుకున్నారు.