బొమ్మ అదిరింది షో తెలుసు కదా. జీ తెలుగులో అదిరింది షో కాస్త బొమ్మ అదిరింది షో గా మారింది. నాగబాబు, జానీ మాస్టర్ హోస్ట్ లు గా వ్యవహరిస్తున్నారు. శ్రీముఖి యాంకర్. అయితే.. ప్రతి ఎపిసోడ్ కు ఎవరో ఒకరు గెస్ట్ రావడం పరిపాటి. ఈ వారం ఎపిసోడ్ కు పోసాని కృష్ణమురళి గెస్ట్ గా వచ్చాడు.
ఆయన గెస్ట్ గా రావడం ఏమో కానీ.. ఆయన చేసిన సందడి మాత్రం మామూల్ది కాదు. ఆయన సినిమాల్లో కొన్నికొన్ని సార్లు సీరియస్ పాత్రలు చేసినా.. బయట మాత్రం చాలా సరదా మనిషి అని రుజువయింది.
బొమ్మ అదిరింది షో అంటేనే కామెడీ షో. కామెడీకి మరో అర్థం చెప్పాడు పోసాని. ఎంట్రీ ఇవ్వడమే డ్యాన్స్ అదరగొట్టేశాడు. ఆ తర్వాత శ్రీముఖిపై పంచుల వర్షం కురిపించాడు. మేడం మీరు మారిపోయారు అంటూ పంచ్ వేశాడు శ్రీముఖి మీద. శ్రీముఖి కూడా వెంటనే ఎలా మారిపోయాను.. అంటూ పంచ్ వేసింది. బూరెలా పొంగారు అంటూ పోసాని పంచ్ వేయడంతో సెట్ లో అందరూ తెగ నవ్వేశారు.
ఆ తర్వాత పండుకు పెళ్లి చేయాలి.. అంటూ శ్రీముఖి.. పోసానిని అడిగినప్పుడు కూడా పోసాని.. శ్రీముఖిపై మామూలుగా పంచ్ లు వేయలేదు. మొత్తానికి పోసాని.. సరదా మనిషి అని రుజువైంది. దానికి సంబంధించిన ప్రోమోను మీరే చూడండి.
https://www.youtube.com/watch?v=qPnDgSPkR-s