Prabhas: “బాహుబలి” విజయంతో ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్ అయినా సంగతి తెలిసిందే. అంతకు ముందు ప్రభాస్ క్రేజ్ కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే పరిమితం అయి ఉండేది. తన కెరీర్ లో.. “బాహుబలి” బొమ్మ ఎప్పుడైతే పడిందో.. అప్పుడు ప్రభాస్ తలరాత ఒక్కసారిగా మారిపోయింది. కాగా ప్రస్తుతం ప్రభాస్ తో.. దేశవ్యాప్తంగా చాలా ఇండస్ట్రీలకు చెందిన స్టార్ డైరెక్టర్లు ప్రముఖ నిర్మాణ సంస్థలు సినిమాలు చేయడానికి తెగ ఎగపడుతున్నాయి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో “రాధేశ్యాం” సినిమా చేస్తూనే మరోపక్క..”కేజీఎఫ్” డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత మహా నటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. ప్రభాస్ సినిమా ఒప్పుకోవటం జరిగింది. గత లాక్డౌన్ సమయంలో ఈ సినిమా ప్రకటన వైజయంతి మూవీస్ బ్యానర్ ప్రకటించడం జరిగింది. ప్రభాస్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుంది.
Read more: Prabhas: ప్రభాస్ “సలార్” కోసం సరికొత్త నిర్ణయం తీసుకున్నా ప్రశాంత్ నీల్..!!
కాగా ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ విషయంలో హాలీవుడ్ స్థాయిలో.. కెమెరాలు ఉపయోగిస్తున్నట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వినబడుతుంది. అర్రి అలెక్స అనే అడ్వాన్స్డ్ కెమెరా ఎక్కువగా హాలీవుడ్ మూవీస్ చిత్రీకరించే ఈ కెమెరా తో నాగ్ అశ్విన్ ప్రభాస్ సినిమా చిత్రీకరించనున్నారు అట. వంద రోజులకు ఈ కెమెరా అద్దె .. 7.5 కోట్లు అట. అంతటి ఖరీదైన కెమెరాలతో నాగ్ అశ్విన్ ప్రభాస్ సినిమా చిత్రీకరణ జరగనున్నట్లు టాక్. టైం మిషన్ తరహాలో గతంలో బాలయ్య బాబు నటించిన ఆదిత్య369 తరహాలో.. ఈ సినిమా చిత్రీకరణ జరగనున్నట్లు సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!