Adipurush : ఆదిపురుష్ షూటింగ్ ముంబై లో శరవేగంగా సాగుతోంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. నాలుగు భారీ బడ్జెట్ సినిమాలని వరసగా కమిటయిన ప్రభాస్ అన్ని సినిమాల ని అలాగే లైన్ గా సెట్స్ మీదకి తీసుకు వస్తున్నాడు. రాధే శ్యాం సినిమా షూటింగ్ కంప్లీట్ చేస్తూనే సలార్, ఆదిపురుష్ సినిమాలని సెట్స్ మీదకి తీసుకు వచ్చాడు. సలార్ షూటింగ్ రామగుండం లో 10 రోజుల షెడ్యూల్ పూర్తి చేసి ఆ తర్వాత ఆదిపురుష్ లో పాల్గొన్నాడు.
ఆ తర్వాత మళ్ళీ సలార్ షూటింగ్ కొన్ని రోజులు చేసి ప్రస్తుతం ఆదిపురుష్ షూటింగ్ కోసం ముంబై లో ఉన్నాడు. ప్రస్తుతం ఈ షెడ్యూల్ లో ప్రభాస్ తో పాటు సీత పాత్రలో కనిపిస్తున్న కృతి సనన్, లక్ష్మణుడిగా కనిపించనున్న సన్నీ సింగ్ పాల్గొంటున్నారట. అయితే ఎక్కువగా ప్రభాస్ మీద సోలో షాట్స్ కంప్లీట్ చేస్తున్నట్టు తెలిస్తోంది. కాంబినేషన్ సీన్స్ తో పాటు సోలో షాట్స్ కంప్లీట్ కాగానే మళ్ళీ సలార్ సెట్స్ లో అడుగుపెడతాడని తెలుస్తోంది. ఇలా ప్రభాస్ నాన్ స్టాప్ గా షూటింగ్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు.
Adipurush : ఆదిపురుష్ 3డి సినిమాగా తయారవుతున్న సంగతి తెలిసిందే.
ఆదిపురుష్ 3డి సినిమాగా తయారవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రత్యేకమైన మోషన్ క్యాప్చర్ బృందం సెట్స్లో ఉన్నారు. ఇక ఈ సినిమాను దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మైథలాజికల్ సినిమాలో సైఫ్ అలీఖాన్ రావన్ పాత్రలో కనిపించనున్నాడు. మరో రెండు కీలకమైన పాత్రలను ఎంపిక చేయాల్సి ఉంది. కాగా వచ్చే వారం నుంచి మళ్ళీ సలార్ సినిమా కోసం హైదరాబాద్ రానున్నాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శృత్ హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ప్రభాస్ – పూజా హెగ్డే ల రాధే శ్యాం జూలై 30న దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మించబోయో సినిమా కూడా ఈ ఏడాది ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించబోతున్నాడు.