ఇండియన్ పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ మాస్ ఎలివేషన్ పల్స్ తెలిసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో “సలార్” అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కే జి ఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ తో దేశవ్యాప్తంగా చాలా మంది స్టార్ హీరోలు పని చేయాలని భావించారు కానీ ప్రభాస్ తో సినిమా ఒప్పుకోవడంతో సలార్ పై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి.
పాన్ ఇండియా లెవెల్ లో సలార్ సినిమా ఉండబోతున్న తరుణంలో.. ప్రభాస్ కి జోడి గా ఎవరు నటిస్తారు అన్నది సస్పెన్స్ గా మారింది. ఇటువంటి తరుణంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు అయినా కత్రినా కైఫ్, దిశాపటాని పేర్లు ఎక్కువగా వినబడుతున్నాయి. ఇదిలా ఉంటే వీళ్ళిద్దరిలో ఎక్కువశాతం దిశాకే ఛాన్స్ ఇచ్చే ఆలోచన ప్రభాస్ చేస్తున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినబడుతున్నాయి.
ప్రస్తుతం ప్రభాస్ రాదే శ్యాం అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి చివరాఖరి కల్ల పూర్తవుతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఈ లోపు సలార్ సినిమా హీరోయిన్ ఎవరు అనేది తెలిసే అవకాశం ఉందని ఎక్కువగా దిశానే సెలెక్ట్ చేయడానికి డైరెక్టర్ ప్రశాంత్ నిల్ కూడా ఆలోచన చేస్తున్నట్లు ఫిలిం వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా కే జి ఎఫ్ డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా అనే సరికి ఈ ప్రాజెక్టు పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులకు ఉత్కంఠ నెలకొంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!