యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే అక్టోబర్ 23 తారీకు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ గిఫ్ట్… ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయినట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. ‘బీట్స్ ఆఫ్ రాధేశ్యాం’ పేరుతో “రాధేశ్యాం” సినిమా యూనిట్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు.. నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ ట్విటర్ లో క్లారిటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మరోసారి వాళ్లు మిమ్మల్ని కచ్చితంగా ప్రేమలో పడేస్తారు, అక్టోబర్ 23న మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు.
దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ ప్రభాస్ సినిమాకి సంబంధించి పోస్టర్ రిలీజ్ అవుతున్న తరుణంలో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇదే తరుణంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా అదేవిధంగా ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రెండు సినిమాలకు సంబంధించి కూడా ఏదో ఒక సర్ప్రైజ్ ఉండే అవకాశం ఉందని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. “జిల్” ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాధేశ్యాం” పిరియాడికల్ లవ్ స్టోరీ తరహాలో ఉండబోతుందట.
కృష్ణంరాజు సొంత బ్యానర్ మరియు యు.వి.క్రియేషన్స్ సంస్థ బ్యానర్ సంయుక్తంగా కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా గత కొన్ని నెలలుగా షూటింగ్ ఆగిపోయింది. మళ్లీ ప్రభుత్వాల నుంచి అనుమతులు రావడంతో ఈ సినిమా షూటింగ్ ఇటలీలో పున ప్రారంభం అయింది. పూజా హెగ్డే ప్రభాస్…పై ఇటలీలో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాట్టూ టాక్.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!