ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. యువి క్రియోషన్స్, గోపీ కృష్ణ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ప్రభాస్ లుక్ గాని, సినిమా టైటిల్ గాని రిలీజ్ చేయడం లేదని ఫ్యాన్స్ ని తీవ్ర నిరాశలో ఉన్నారు.
ఇందుకు సంబంధించి ఫ్యాన్స్ ఈ మధ్య కొంత అసహనానికి లోనవుతూ ప్రభాస్ ని సినిమా అప్డేట్ ఇవ్వాల్సిందిగా రివెస్ట్ కూడా చేశారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి వస్తున్న ఈ ఒత్తిడిని తట్టులేక ఎట్టకేలకి ఈ రోజు గుడ్ న్యూస్ చెప్పాడు. ప్రభాస్ 20వ సినిమా ఫస్ట్ లుక్ జులై 10వ తేదీన ఉదయం 10:10 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభాస్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఈ విషయం ఫ్యాన్స్ తో పంచుకున్నారు. దాంతో మరో రెండు రోజుల్లో తన అభిమాన నటుడి సినిమా నుండి అదిరిపోయీ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రానుందని సంబర పడుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇప్పటి వరకు “రాధే శ్యామ్” అన్న టైటిల్ ప్రచారంలో ఉండగా అదే దాదాపు ఫైనల్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!